Sunday, December 19, 2010

బాబుపై రైతు ముద్ర

babu-showingకాలం చాలా విచిత్రమయింది. అందులో రాజకీయాల్లో ముద్రలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. వాటిని చెరిపేసు కోవడం, నిలబెట్టుకోవడం ఆయా నేతల వ్యూహాలు, ఎత్తు గడ, వైఖరి బట్టే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విషయంలో ఇది నిజమవుతోంది. ఒకప్పుడు వైఎస్‌ వ్యూహాత్మక దాడి పుణ్యాన రైతు వ్యతిరేకిగా, ఎక్కడా అధికారికంగా వ్యవ సాయం దండుగ అని ప్రకటించకపోయినప్పటికీ, దాదాపు ఆరేళ్లు అలాంటి అపవాదు ఎదుర్కొన్న బాబు.. ఇప్పుడు ఆ వ్యతిరేక ముద్రను తొలగించుకుని, రైతుల కోసం పోరాడే నేతగా ముద్రపడేందుకు చేసిన శ్రమ ఫలించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొంగిచూస్తోంది.

గత 15 నెలల నుంచి రాష్ట్రంలో వరస వరస వెంట వచ్చిన తుపాన్లు, వరదలు, భారీ వర్షాలతో గుండెకోతకు గురయిన రైతాంగం కోసం బాబు పోరాడటం ప్రారంభిం చారు. ముఖ్యమంత్రులు, మంత్రుల కంటే ముందుగా వర్షం బాధితుల వద్దకు వెళ్లి వారి పక్షాన నిలుస్తుండటంతో క్రమంగా తనపై ఉన్న రైతు ముద్రను తొలగించుకోవడం ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్‌ ప్రభు త్వం కూడా రాజకీయ అంతర్గత కలహాలలో మునిగి, రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తుండటం టీడీపీకి కలసివచ్చింది.

babu-readఅయినప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీ గతంలో బాబుపై తాను వేసిన రైతు వ్యతిరేక ముద్రను తరచూ గుర్తు చేసి, ఎదురుదాడి చేసినప్పటికీ, బాబు రైతాంగం వద్దకు వెళ్లిన ప్పుడు అక్కడ ఆయనకు సానుకూల స్పందన లభించటం తో అధికార పార్టీ ఎదురుదాడికి పస లేకుండా పోయింది. బాబు వ్యవసాయం దండుగ అన్నారని కాంగ్రెస్‌ నేతలు దాడి చేయడం, ఆ వ్యాఖ్య ఎప్పుడు చేశారో చెప్పాలని టీడీ పీ ఎదురుదాడి చేసినా కాంగ్రెస్‌ నేతలు మౌనంగా ఉండ టమే రైతుల్లో వచ్చిన మార్పునకు కారణంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ స్థాయిలో వ్యక్తిగత ఆక ర్షణ, ఇమేజ్‌ లేకపోయినా, ఇటీవల కురిసిన జల్‌ తుపాన్‌ బాధితులను ఆదుకునేందుకు వెళ్లిన బాబుకు ఉభయ గోదావరి వంటి జిల్లాల్లో రైతాంగం తెల్లవార్లూ ఆయన కోసం ఎదురుచూసి, ఆయనను తమ పొలాల్లోని నడిపించిన వైనం పార్టీ నేతలనే విస్మయపరి చింది. దానిని పరిశీలిస్తే బాబుపై గతంలో ఉన్న రైతు వ్యతిరేక ముద్ర పూర్తిగా చెరగడమే కాకుండా, రైతులు బాబుపై ఆశలు పెంచుకున్నట్లు స్పష్టమవుతుంది.

తాజాగా శాసనసభ వేదికగా అధికారపార్టీ- తెలుగు దేశం పార్టీకి మధ్య జరిగిన రైతు యుద్ధంలో టీడీపీ వీల యినంత ఎక్కువ మైలేజీ సాధించే ప్రయత్నంలో విజయం సాధించింది. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ బాబు సభలో చేసిన హడావిడి, ఆ తర్వాత ప్రారంభించిన నిరాహార దీక్షతో రైతాంగంపై తన ముద్ర వేసేలా సఫలీకృ తులయ్యారు.

Tdp-mlasగత రెండురోజుల నుంచి బాబు ప్రారంభిం చిన దీక్షకు తెలంగాణ రైతాంగం నుంచి విపరీతమైన స్పం దన వ్యక్తం కావడం పరిశీలిస్తే.. బాబుపై రైతు ముద్ర ప్రారంభమయిందని స్పష్టంగా కనిపిస్తోంది. 2004 నాటి ఎన్నికల్లో తెలంగాణ రైతాంగం టీడీపీకి వ్యతిరేంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తెలంగాణ రైతాం గం స్వచ్ఛందంగా బాబు దీక్షా శిబిరానికి తరలిరావడం వారిలో వచ్చిన మార్పుకు నిదర్శనంగా కనిపిస్తోంది. తెలం గాణ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌, తెలంగాణ బీసీ ఫ్రంట్‌, తెలం గాణ అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక వంటి ప్రజాసం ఘాలు బాబు దీక్షకు మద్దతునివ్వటం కొత్త పరిణామం.

బాబు దీక్ష రాజకీయ ప్రయోజనాల కోసమేనని కాం గ్రెస్‌- పీఆర్పీ విమర్శించినప్పటికీ, దీక్షా శిబిరానికి హాజ రవుతున్న రైతాంగం, రైతు సంఘాలు, రైతు కూలీ సంఘా ల నాయకులు దీక్షక మద్దతునిస్తున్నారు. బాబుకు వ్యక్తి గత మద్దతు కంటే రైతాంగం కోసం ఆయన ఎన్నుకున్న మార్గానికే ఇంత అనూహ్య స్పందన లభిస్తుందనేది నిర్వి వాదం. దీక్షా శిబిరానికి జాతీయ నాయకులయిన ప్రకాష్‌ కరత్‌, బర్దన్‌, దేవెగౌడ, రాజా వంటి ప్రముఖులు హాజరై, బాబు ఒంటరివాడు కాదని, రైతు సమస్యలు పరిష్కరిం చకపోతే బంద్‌కూ పిలుపునివ్వక తప్పదని హెచ్చరించిన తీరు.. బాబుకు జాతీయ స్థాయిలో కూడా రైతునేతగా ఆద రణ పెరుగుతున్న విషయాన్ని పార్టీవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Tdp-mlas,-ledyబాబు దీక్షతో తమ పార్టీకి గ్రామ స్థాయిలో రైతాం గం దగ్గరవుతోందని, జిల్లాల్లో బాబుకు మద్దతుగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో ఏ పార్టీకి సంబంధం లేని తటస్థ రైతులు ఆందోళన కార్యక్రమాల్లో హాజరవుతుండటం సా నుకూల పరిణామాలేనని పార్టీ సీనియర్లు వివరిస్తున్నారు. గతంలో రైతుల పక్షాన తాము చేసిన పోరాటాలకు తమ పార్టీకి చెందిన సానుభూతిపరులు మాత్రమే హాజరయ్యే వారని, ఇప్పుడు సాధారణ రైతులు, రాజకీయ పార్టీలతో ఎలాంటి అనుబంధం లేని రైతులు కూడా రావడం తమ పార్టీకి గ్రామ స్థాయిలో అదనపు బలం ఇచ్చినట్టయిందన్న ఉత్సాహంతో టీడీపీ నేతలు కనిపిస్తున్నారు.

No comments:

Post a Comment