Sunday, December 19, 2010

ఈ మౌనం దారుణం

Babu-laughఆంధ్రప్రదేశ్‌లో రైతుల సమస్యలపట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మౌనం పాటిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు రాసిన లేఖలో ఘాటుగా విమర్శించారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 62 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారిలో 42 మంది ఆత్మహత్యలు గత మూడు రోజుల్లోనే చోటు చేసుకున్నాయని బాబు తన లేఖలో పేర్కొన్నారు. ‘తుపాన్‌లు, భారీ వర్షాలవల్ల ఈ ఖరీఫ్‌లో రైతాంగం బాగా దెబ్బతిన్నదన్నారు. ‘రైతులకు ధైర్యం చెప్పేందుకు నేను ఇటీవల రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాను. వారింత దైన్యస్థితిలో ఉండడం ఇదివరకెన్నడూ చూడలేదు. నేను వెళ్లిన ప్రతిచోటా రైతులు కన్నీళ్లు లపెట్టుకొన్నారు. పాడైన పంటను చూపించారు.

వారి పరిస్థితి చూసి చలించిపోయాను. రైతుల్ని ఆదుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించలేదు. ఇందుకు నిరసనగా నేను 2010 డిసెంబర్‌ 17 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాను’ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లోవ్యవసాయంపై వ్యయం పెరిగిందని, కానీ రైతు ఆదాయం కుంటుపడిందని వివిధ సర్వేల వల్ల తెలిసిందన్నారు. వ్యవసాయానికి కావలసిన ముడి సరకులు, వ్యవసాయ ఉత్పత్తుల ధరల్ని నిర్ణయించడంలో ఇప్పుడు అనుసరిస్తున్న విధానాల్ని పునః పరిశీలించాల్సిన అవసరముందన్నారు.

వ్యవసాయం ఆదాయాన్ని చేకూర్చే రంగంగా మారకపోతే, జాతీయస్థాయిలో ఆహార భద్రతకే సవాల్‌ కాగల ప్రమాదముందని చంద్రబాబునాయుడు ఆ లేఖలో హెచ్చరించారు.వ్యవసాయాభివృద్ధికి స్వామినాథన్‌ కమిషన్‌ వంటి కమిటీలు చేసిన సిఫార్సుల్ని బాబు ప్రశంసించారు. ఇటీవలి కాలంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పెరిగిందని, ఇందువల్ల వ్యవసాయాన్ని ఆదాయాన్నిచ్చే వృత్తిగా మార్చే అవకాశం ఉందని బాబు ప్రధానికి సూచించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ఇస్తున్న నష్టపరిహారం, సబ్సిడీలు ఏమాత్రం సరిపోవడం లేదని, మారిన కాలానికి అనుగుణంగా, అప్పటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు అందించే నష్టపరిహారాన్ని పెంచాల్సిన అవసరం ఎంతో ఉందని బాబు ప్రత్యేకంగా పేర్కొన్నారు.

స్వాతంత్య్రానికి పూర్వం రైతు ప్రకృతి దయమీద, వడ్డీ వ్యాపారుల పైనా, వ్యవసాయంలో పురాతన పద్ధతుల మీదా ఆధారపడాల్సి వచ్చేది, స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా రైతు మళ్లీ అదే పరిస్థితికి దగ్గరవుతున్నాడని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘కష్టంలో ఉన్న రైతును ఆదుకోవాలని, సహాయ ప్యాకేజీని పెంచాలని ప్రభుత్వానికి నచ్చచెప్పేందుకు మేం ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కనుక, రైతుల్ని ఆదుకోవాలని, వారిని సంక్షోభం నుంచి గట్టెక్కించే చర్యలు తీసుకోవాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మరో విషయం...వ్యవసాయం లాభదాయకమని రైతులు తెలుసుకొని, చైతన్యం పొందేందుకు, దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులపై చర్చకు పిలుపునివ్వాల్సిందిగా కోరుతున్నాను’ అని చంద్రబాబునాయుడు ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

చాలా చేశాం ఇంకా చేస్తాం
CM-Kiran-Kumar-Reddyహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : యుపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమానికి నిరంతరం పాటుపడతాయని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫ లం అయిందని ప్రతిపక్షాలు చేస్తున్నవన్నీ రాజకీయాలని ఆయన స్పష్టంచేశారు. రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని, సేద్యం దండుగ కాదు పండుగ అని నిరూపించిన వ్యక్తి రైతు బాంధవుడు దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చూపిన బాట, చెప్పిన మాట మాకు ఆదర్శమని ముఖ్యమంత్రి వెల్లడించారు. రైతులపై ప్రభుత్వం తీసు కుంటున్న సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రైతు సోదరులకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం మీడియాకు విడుదల చేసింది.

గత 15 నెలల్లో వరుసగా ఐదుసార్లు సంభవించిన వరదలు, భారీ వర్షాలు, తుఫానుల వల్ల రాష్ట్ర రైతాంగానికి తీరని నష్టంవాటిల్లిందని, వేల రూపాయల పెట్టుబడి పెట్టి ఆరుగాలం స్వేదాన్ని ధారపోసి చేసిన సేద్యం పంట ఫలాలు నీటిపాలయ్యాయని ఇటాంటి పరిస్ధితుల్లో రైతులు ఆత్మస్ధైర్యంతో ఉండాలన్నారు. ఇది రైతు ప్రభుత్వం, రైతు మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వమని రైతు సంక్షేమంపై దృష్టిపెడుతుందని సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే దాదాపు 28 లక్షల రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని, రూ.1250 కోట్ల విద్యుత్‌ బకాయిలు రద్దుచేయడం జరిగిందన్నారు. గ్రామం ఒక యూనిట్‌గా పంటలభీమాను అమలు చేస్తున్నామన్నారు. 2004-05 నుంచి ఇప్పటివరకు 36.5 లక్షల రైతులకు లబ్ధి చేకూరేలా మొత్తం రూ.2700 కోట్లు పంట భీమా కింద చెల్లించామని, రైతులకు ఇచ్చే రుణాలను రెట్టింపు చేసి 2004-05 నుంచి ఇప్పటివరకు 5.83 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ.1,61,100 కోట్లు చెల్లించా మని లేఖలో పేర్కొన్నారు.

(2004లో రూ.13620 కోట్లు, 2009లొ రూ.37574 కోట్లు, ఈ ఆర్ధిక సంవత్సరంలో (2010-11) ఇప్పటివరకు రూ.27,652 కోట్లు పంటరుణాలు ఇచ్చామన్నారు. రుణమాఫీ కింద 2008-09లో 64 లక్షల మంది రైతులకు కేంద్ర ప్రభు త్వం రూ.11350 కోట్లతో రైతులకు లబ్దిచేకూర్చిం దన్నా రు. కేంద్ర వడ్డీ మాఫీ, రుణ మాఫీ వర్తించని 32 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రూ.1600 కోట్ల మేరకు ఆర్ధికసాయం అందిం చింది. వీటితోపాటు రైతు మెచ్చే జలయజ్ఞం ద్వారా భవిష్యత్తులో కోటి ఎకరాల ఆయకట్టుకు నీటిపారుదల సౌకర్యం కల్పించాలన్నది ప్రభుత్వం లక్ష్యమని సీఎం లేఖలో పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఈ పధకం కిం ద దాదాపు 20 లక్షల ఎకరాల ఆయకట్టు ను లతఅభివృద్ధి చేశామన్నారు. వీటి కారణం గానే రికార్డుస్ధాయిలో 204 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ దిగుబడులకు సాధ్య మైందన్నారు. అయితే దురదృష్టవశాత్తు పలు పర్యాయాలు సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు మనకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. అయినా ఆత్మవిశ్వా సంతో రైతు సం క్షేమంకోసం మరింతగా కృషిచేస్తున్నా మని, రైతులకు అండగా నిలబడటం ప్రభుత్వ బాధ్యతగా సీఎం తెలిపా రు. ఇదిలాఉంటే గత టీడీపీ హయాంలో వరి, ప్రత్తి, వేరుశనగ, మిరప, కూరగాయలు, ఉల్లి, బొప్పాయి, కర్బూజ వంటి పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ హెక్టారుకు రూ.1500 గా ఉండేదని, రూ.4500 లకు పెంచామన్నారు.

కాగా ఇప్పుడు జరిగిన పంటనష్టం చూసిన తరువాత హెక్టారుకు రూ.6000 గా నిర్ణయించా మన్నారు. ఇదీ రైతు వ్యతిరేకులైనవారికి, రైతు శ్రేయోభి లాషులకు మధ్య తేడా అని సీఎం లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన 15 రోజుల్లోనే రైతుల కోసం పాత బకాయిలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.695 కోట్లు విడు దల చేసిందన్నారు. అంతేకాకుండా నష్టపోయిన రైతులం దరికీ కూడా పెట్టుబడి రాయితీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని, రబీ సీజన్‌లో సబ్సిడీతో విత్తనాలు అందిస్తామన్నారు. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇప్పటికే ప్రధానమంత్రిని కోరామని సీఎం తెలిపారు. ఈ కఠోర వాస్తవాలు ఇలా ఉంటే రైతులు ఇబ్బందులో వున్నప్పుడు వారికి మనోస్థైర్యం చెప్పి రైతు లకు ఆసరాగా నిలవాల్సిన రాజకీయ పార్టీలు చేస్తు న్న నిర్వాకమేమిటని సీఎం ప్రశ్నించారు.

No comments:

Post a Comment