రైతు సమస్యల పరిష్కారం కోసం తాను చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను అవమానకర రీతిలో భగ్నం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సిద్ధమవు తున్నారు. అధికార పార్టీలో ఉన్న అంతర్గత కలహాలను సద్వినియోగం చేసకుని, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు సోమవారం భేటీ అయిన పొలిట్బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న బడ్జెట్ సమావేశాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
అంతర్గత కలహాలు, అధిపత్యపోరు సమస్యల్లో కూరుకు పోయి ఉన్న కాంగ్రెస్పై ఇక మానసిక యుద్ధం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. రైతు సమస్యల నేపథ్యంలో వారి పక్షాన ఆందోళన కార్యక్రమా లను మరికొంత కాలం కొనసాగించాలని పార్టీ నాయ కత్వం నిర్ణయించింది. బాబు నిరాహారదీక్ష ద్వారా రైతాం గం నుంచి పెరుగుతున్న మద్దతును వినియోగించుకునే క్రమంలో, అటు కాంగ్రెస్-ఇటు జగన్ను ఏకకాలంలో దెబ్బతీయడంతో పాటు.. ప్రస్తుతానికి కాంగ్రెస్కు మానసిక మద్దతుదారులుగా ఉన్న టీఆర్ఎస్, పీఆర్పీని కూడా ఇరుకున పెట్టేందుకు కార్యాచరణ ప్రారంభించింది.
ఫిబ్రవరిలో జరగనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా కాంగ్రెస్ లోని కుమ్ములాటను పరిశీలించి, దాని ఫలితంతో సరైన అంచనాతో వ్యూహరచన చేయాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. ప్రభుత్వం కూలిపోతుం దన్న బలమైన విశ్వాసం లేకపోయినప్పటికీ.. దాని ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో తగిన నిర్ణయం తీసుకోవచ్చన్నది టీడీపీ వ్యూహంలాకనిపిస్తోంది.
ప్రధానంగా.. జగన్ ఆలోగా పార్టీ పెడతారని ఆశిస్తున్న టీడీపీ నాయ కత్వం.. తాను అసెంబ్లీలో సర్కారుపై అవిశ్వా సం పెడితే కాంగ్రెస్లో ఉన్న జగన్ మద్దతు దారులు అనివార్య పరిస్థితిలో కాంగ్రెస్కు వ్యతిరేక ఓటు వేయక తప్పదని టీడీపీ నాయకత్వం అంచనా వేస్తోంది. సుమారు 40-45 మంది ఎమ్మెల్యేలు సర్కా రుకు వ్యతి రేకంగా వ్యవహరించవచ్చని లెక్కలు వేస్తోం ది. ఒకవేళ జగన్ మద్దతు దారులయిన ఎమ్మె ల్యేలు కాంగ్రెస్కు వ్యతిరేక ఓటు వేయకపోతే అది జగన్కే నష్టమన్న సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నందున, దానివల్ల తమకొచ్చే అదనపు నష్టమేమీ లేదని భావిస్తోంది.
అది కూడా ఒకందుకు తమకే మంచిదని, రానున్న ఎన్నికల్లోగా ఇక పీఆర్పీ ప్రతిపక్షం కాదని, దానికి రైతాంగ సమస్యలపై ఆసక్తి లేదని, అది అధికారపార్టీకి తొత్తేనన్న ప్రచా రం చేసేందుకు అసెంబ్లీ ఒక మంచి వేదికగా పనికి వస్తుందని టీడీపీ నేతలు విశ్లేషిస్తు న్నారు. అదీగాక.. అసలు పీఆర్పీలోనే జగన్ వైపు 12 మంది వెళతారన్న వార్తలను కూడా టీడీపీ పరిగణనలోకి తీసుకుంది.
టీఆర్ఎస్ కూడా అవిశ్వాస సమయంలో కాంగ్రెస్కు అనుకూలంగానే వ్యవహరిస్తుం దని టీడీపీ నాయకత్వం అంచనా వేస్తోంది. కాంగ్రెస్ను బలోపేతం చేయవలసిన బాధ్యత తమపై ఉందని కేసీఆర్ గతంలోనే ఢిల్లీలో స్పష్టం చేసినందున, అవిశ్వాసం సమ యంలో టీఆర్ఎస్ తమ వైపు ఉంటుందని భావించడం కూడా అవివేకమంటున్నారు. అయితే, టీఆర్ఎస్ అవిశ్వాస సమయంలో సర్కారుపై మొగ్గు చూపినా తమకే లాభ మంటున్నారు. కాంగ్రెస్-టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగుకు ఇదే నిదర్శనమని, టీఆర్ఎస్కు రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేదన్న ప్రచారం చేయవచ్చని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. 294 మంది ఉన్న సభలో వైఎస్ విజయలక్ష్మి రాజీనామాతో 293 మంది ఉన్నారు.
వారిలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలం 155, తెలుగు దేశం 91, పీఆర్పీ 18, టీఆర్ఎస్ 11, మజ్లిస్ 7, సీపీఐ 4, బీజేపీ 2, లోక్సత్తా 1, సీపీఎం 1, ఇండిపెండెంట్ల బలం 3 ఉన్నాయి. వీరిలో జగన్కు మద్దతుదారు లుగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 40గా భావి స్తున్నారు. అంటే కాంగ్రెస్ బలం 155 నుంచి 115కి పడిపోతుంది. అప్పుడు ప్రధాన ప్రతిపక్షానికీ-కాంగ్రెస్కూ 24 మాత్రమే తేడా ఉంటుంది. అయితే ప్రస్తు తం ప్రచారం జరుగుతున్నట్లు 18 మంది ఉన్న పీఆర్పీ ఎమ్మె ల్యేలు 12 మంది జగన్ వైపు వెళితే కాంగ్రెస్కు 6గురు ఎమ్మెల్యేల బలం పెరుగుతుంది. అప్పటికీ కాంగ్రెస్ బలం 121 మాత్రమే. అప్పుడు కూడా టీడీపీ-కాంగ్రెస్ మధ్య తేడా 30 ఉంటుంది.7 గురు సభ్యులున్న మజ్లిస్ పార్టీ కనుక కాంగ్రెస్కు వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే జగన్ మద్దతు దారుల బలం 59కు పెరుగు తుంది. వామ పక్షాలు, బీజేపీ కలిపితే టీడీపీ బలం 91 నుంచి 98కి పెరుగుతుంది. ముగ్గురు ఇండి పెండెంట్లు, ఒక లోక్సత్తా కలిపితే 161 కాంగ్రెస్కు వ్యతిరేకం, 121 అనుకూలంగా బలాలు తారుమారవుతాయి.
ఒకవేళ టీఆర్ ఎస్ గనుక కాంగ్రెస్కు మద్దతు నిస్తే దాని బలం 132కు మాత్రమే పెరిగే అవ కాశం ఉంది. నిజంగా ఇదంతా జరిగితే కాం గ్రెస్ ప్రభుత్వం 29 ఓట్లతో కుప్పకూలి పోవ డం ఖాయమన్న విశ్లేషణలు జరుగు తున్నా యి. ప్రధానంగా.. జగన్ వర్గం అవిశ్వాస తీర్మాన సమయంలో ఆత్మ ప్రబోధానుసారం మేరకు ఓటు వేయాలని పిలుపునిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని చిక్కుల్లో పడక తప్పదని టీడీపీ నాయకత్వం అంచనా వేస్తోంది. గతంలో వివి గిరి ఎన్నికల సమయంలో ఇందిరాగాంధీ కూడా ఇలాంటి పిలుపునే ఇచ్చి.. తాను నిలబెట్టిన నీలం సంజీవరెడ్డిని ఓడించిన విషయం తెలిసిందే. రేపు శాసన సభలో కూడా జగన్ ఇలాంటి ఎత్తుగడ అను సరిస్తారని టీడీపీ నాయకత్వం ఆశిస్తోంది.
ఇద్దరూ కలిస్తే కాంగ్రెస్ కొంప కొల్లేరే ....
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రభు త్వంపై టీడీపీ అవిశ్వాసం పెట్టే సమయంలో జగన్ వర్గం, ఆయనకు మద్దతునిస్తున్న 40 మంది ఎమ్మెల్యేలు (ప్రస్తుతానికి), 7 మంది మజ్లిస్, 12 మంది పీఆర్పీ, ఐదుగురు వామ పక్షాలు, ఇద్దరు బీజేపీ, ముగ్గురు స్వతం త్రులు, ఒక లోక్సత్తా కలసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా రైతుల కోసం ఒక కూటమిగా ఏర్పడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ వ్యతిరేక కోణంలో టీడీపీ- జగన్ మద్దతుదారులు ఒక తాటిపైకి వస్తారా అన్నదే సందేహం. దానిపైనే కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంటుంది.
No comments:
Post a Comment