"మీ ఆరోగ్యంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీక్ష విరమించండి''- మంత్రుల బృందం.
"నా ఆరోగ్యం ముఖ్యం కాదు. రైతులకు సంబంధించి మా డిమాండ్లు ఆమోదిస్తేనే విరమిస్తా''- చంద్రబాబు స్పష్టీకరణ.

వరుసగా ఐదోరోజూ... ఆస్పత్రిలోనూ ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు మరింత నీరసించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. బలవంతంగానైనా బాబుకు సెలైన్ ఎక్కించి దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు వ్యూహ రచన చేశారు. మరోవైపు, పార్టీ నేతలు, మంత్రులు కోరినా దీక్ష విరమణకు చంద్రబాబు ససేమిరా అన్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే, చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా మారితే ఏం చేయాలన్న దానిపై మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పితాని సత్యనారాయణ, శత్రుచర్ల విజయరామరాజులతో ముఖ్యమంత్రి చర్చించారు. ముగ్గురు మంత్రుల బృందాన్ని చంద్రబాబు వద్దకు పంపారు. ఈ బృందం మంగళవారం చంద్రబాబుతో చర్చలు జరిపింది.
దీక్ష విరమించాలని కోరింది. ఈ విజ్ఞప్తిని నిర్ద్వంద్వంగా తిరస్కరించిన చంద్రబాబు.. రైతాంగ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ప్రకటన చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆ తర్వాత, టీడీపీ నేతల వద్ద కూడా మంత్రుల బృందానికి ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే తప్ప చంద్రబాబును ఒప్పించే ప్రయత్నం చేయలేమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.
దీంతో.. విపక్ష ఆందోళనల కన్నా ముందే స్పందించి ప్రభుత్వం మంచి ప్యాకేజీయే ఇచ్చిందని, ఇతర రాష్ట్రాల్లోనూ ఇంత భారీఎత్తున నష్ట పరిహారాన్ని చెల్లించడం లేదని స్పష్టం చేసింది. ఈ వాదనతో టీడీపీ నేతలు విభేదించారు. మంచి ప్యాకేజీ అయితే రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని నిలదీశారు. కచ్చితమైన ప్రతిపాదనలతో వస్తే తప్ప దీక్ష విరమించేది లేదని తెగేసి చెప్పారు. దీంతో, చేసేది లేక మంత్రుల బృందం వెనుదిరిగింది.

చంద్రబాబు డిమాండ్లను మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని విలేకరుల వద్ద వ్యాఖ్యానించింది. అయితే, ఇప్పటికే ప్రకటించిన ప్యాకేజీకి అదనంగా ప్రకటించేదేమీ లేదని ప్రభుత్వం పునరుద్ఘాటిస్తోంది. ఇక, ఆరోగ్యం దిగజారుతున్నా వైద్య చికిత్స తీసుకోవడానికి చంద్రబాబు ససేమిరా అంటుండడంతో.. ఆయనకు వైద్య చికిత్స చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
బలవంతంగానైనా బాబుకు చికిత్స చేసేందుకు కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఆ ఆదేశాలను వారు నిమ్స్ వైద్యులకు అందజేశారు. ఈ నేపథ్యంలోనే.. మంగళవారం రాత్రి బలవంతంగా అయినా చంద్రబాబు దీక్షను భగ్నం చేయాలని పోలీసులు వ్యూహరచన చేశారు. దీక్ష భగ్నానికి ప్రభుత్వ స్థాయిలోనే నిర్ణయం జరిగిందని, మంత్రుల బృందం చర్చలు ఇందులో భాగమేనన్న ప్రచారం జరుగుతోంది.
దీంతో.. బలవంతంగానైనా వైద్య చికిత్సను మొదలుపెట్టి.. సెలైన్ కూడా ఎక్కించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ యత్నాలను ప్రతిఘటించేందుకు టీడీపీ నేతలు కూడా సన్నద్ధమయ్యారు. ఆస్పత్రిలోనే మకాం వేశారు. సెలైన్ ఇచ్చినప్పటికీ, నోటి ద్వారా ఆహారం తీసుకోకుండా దీక్ష కొనసాగించాలని కొందరు నేతలు సూచించారు. పూర్తి స్థాయిలో సెలైన్ తీసుకుంటూ గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రిలో పది రోజులు దీక్ష చేసిన విషయాన్ని వారు ఉదహరించారు.
కానీ, మరి కొందరు నేతలు ఈ ప్రతిపాదనతో విభేదించారు. సెలైన్ పెట్టిన తర్వాత దీక్షకు పవిత్రత ఉండదని, అలా చేసేకంటే విరమించడం మంచిదని వాదించారు. అనంతర పరిణామాలను బట్టి తుది నిర్ణయం తీసుకోవా లని వారంతా నిశ్చయించారు. కాగా, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు బీవీ రాఘవులు, కె.నారాయణలతోపాటు ఆర్ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి అవనీరాయ్ తదితరులు మంగళవారం చంద్రబాబును పరామర్శించి సంఘీభావం ప్రకటించారు.
"నా ఆరోగ్యం ముఖ్యం కాదు. రైతులకు సంబంధించి మా డిమాండ్లు ఆమోదిస్తేనే విరమిస్తా''- చంద్రబాబు స్పష్టీకరణ.
వరుసగా ఐదోరోజూ... ఆస్పత్రిలోనూ ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు మరింత నీరసించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. బలవంతంగానైనా బాబుకు సెలైన్ ఎక్కించి దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు వ్యూహ రచన చేశారు. మరోవైపు, పార్టీ నేతలు, మంత్రులు కోరినా దీక్ష విరమణకు చంద్రబాబు ససేమిరా అన్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే, చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా మారితే ఏం చేయాలన్న దానిపై మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పితాని సత్యనారాయణ, శత్రుచర్ల విజయరామరాజులతో ముఖ్యమంత్రి చర్చించారు. ముగ్గురు మంత్రుల బృందాన్ని చంద్రబాబు వద్దకు పంపారు. ఈ బృందం మంగళవారం చంద్రబాబుతో చర్చలు జరిపింది.
దీక్ష విరమించాలని కోరింది. ఈ విజ్ఞప్తిని నిర్ద్వంద్వంగా తిరస్కరించిన చంద్రబాబు.. రైతాంగ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ప్రకటన చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆ తర్వాత, టీడీపీ నేతల వద్ద కూడా మంత్రుల బృందానికి ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే తప్ప చంద్రబాబును ఒప్పించే ప్రయత్నం చేయలేమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.
దీంతో.. విపక్ష ఆందోళనల కన్నా ముందే స్పందించి ప్రభుత్వం మంచి ప్యాకేజీయే ఇచ్చిందని, ఇతర రాష్ట్రాల్లోనూ ఇంత భారీఎత్తున నష్ట పరిహారాన్ని చెల్లించడం లేదని స్పష్టం చేసింది. ఈ వాదనతో టీడీపీ నేతలు విభేదించారు. మంచి ప్యాకేజీ అయితే రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని నిలదీశారు. కచ్చితమైన ప్రతిపాదనలతో వస్తే తప్ప దీక్ష విరమించేది లేదని తెగేసి చెప్పారు. దీంతో, చేసేది లేక మంత్రుల బృందం వెనుదిరిగింది.

చంద్రబాబు డిమాండ్లను మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని విలేకరుల వద్ద వ్యాఖ్యానించింది. అయితే, ఇప్పటికే ప్రకటించిన ప్యాకేజీకి అదనంగా ప్రకటించేదేమీ లేదని ప్రభుత్వం పునరుద్ఘాటిస్తోంది. ఇక, ఆరోగ్యం దిగజారుతున్నా వైద్య చికిత్స తీసుకోవడానికి చంద్రబాబు ససేమిరా అంటుండడంతో.. ఆయనకు వైద్య చికిత్స చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
బలవంతంగానైనా బాబుకు చికిత్స చేసేందుకు కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఆ ఆదేశాలను వారు నిమ్స్ వైద్యులకు అందజేశారు. ఈ నేపథ్యంలోనే.. మంగళవారం రాత్రి బలవంతంగా అయినా చంద్రబాబు దీక్షను భగ్నం చేయాలని పోలీసులు వ్యూహరచన చేశారు. దీక్ష భగ్నానికి ప్రభుత్వ స్థాయిలోనే నిర్ణయం జరిగిందని, మంత్రుల బృందం చర్చలు ఇందులో భాగమేనన్న ప్రచారం జరుగుతోంది.
దీంతో.. బలవంతంగానైనా వైద్య చికిత్సను మొదలుపెట్టి.. సెలైన్ కూడా ఎక్కించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ యత్నాలను ప్రతిఘటించేందుకు టీడీపీ నేతలు కూడా సన్నద్ధమయ్యారు. ఆస్పత్రిలోనే మకాం వేశారు. సెలైన్ ఇచ్చినప్పటికీ, నోటి ద్వారా ఆహారం తీసుకోకుండా దీక్ష కొనసాగించాలని కొందరు నేతలు సూచించారు. పూర్తి స్థాయిలో సెలైన్ తీసుకుంటూ గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రిలో పది రోజులు దీక్ష చేసిన విషయాన్ని వారు ఉదహరించారు.
కానీ, మరి కొందరు నేతలు ఈ ప్రతిపాదనతో విభేదించారు. సెలైన్ పెట్టిన తర్వాత దీక్షకు పవిత్రత ఉండదని, అలా చేసేకంటే విరమించడం మంచిదని వాదించారు. అనంతర పరిణామాలను బట్టి తుది నిర్ణయం తీసుకోవా లని వారంతా నిశ్చయించారు. కాగా, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు బీవీ రాఘవులు, కె.నారాయణలతోపాటు ఆర్ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి అవనీరాయ్ తదితరులు మంగళవారం చంద్రబాబును పరామర్శించి సంఘీభావం ప్రకటించారు.
బాబు ఆరోగ్యం విషమం
రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ గత ఐదు రోజుల నుంచి నిరధిక నిరాహార దీక్ష చేస్తూ, రెండురోజుల నుంచి నిమ్స్లో కూడా నిరాహారదీక్ష కొనసాగిస్తోన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. నాగం జనార్దన్రెడ్డి వంటి నేతలు పార్టీ శ్రేణులు ఆందోళనకు గురికాకుండా ఉండేందుకు బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నప్పటికీ, మంగళవారం అర్ధరాత్రి వరకూ అందిన సమాచారం ప్రకారం బుధవారం సాయంత్రానికి పరిస్థితి ఆందోళన కరంగా మారే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
గత ఐదురోజుల నుంచి ఎలాంటి ఆహారం లేకుండా దీక్ష కొనసాగిస్తోన్న చంద్రబాబునాయుడు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నం దున ఆయన దీక్ష విరమించేలా చూడాలని వైద్యులు ఆయన కుటుంబసభ్యులపై ఒత్తిళ్లు చేస్తున్నారు. వైద్యుల సలహాలను బాబుకు ఆయన కుటుంబసభ్యులు వివరించినప్పటికీ చివరకు కుటుంబసభ్యుల సలహాలు కూడా బాబు బేఖాతరు చేస్తు, దీక్ష కొనసాగించడంతో నేతలు మరింత ఆందోళన చెందుతున్నారు. నాయకులు నిరాహారదీక్ష చేసే సందర్భాల్లోఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉన్నప్పుడు సహజంగా ఫ్లూయిడ్స్ వాడుతుంటారు. ఇది అగ్రనేతల దీక్షల సందర్భంగా ఇది రుజు వయింది. దానివల్ల ఎలాంటి ప్రాణాపాయం ఉండకపోగా, చాలాకాలం ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయితే, గత ఐదురోజుల నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న చంద్రబాబును ప్రభుత్వం అరెస్టు చేసి నిమ్స్లో చేర్చిన తర్వాత చాలా నీరసంగా, బలహీనంగా కనిపిస్తున్నారు. ఫ్లూయిడ్స్ తీసుకోకపోతే ఆరో రోజుకు ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
‘నేను నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు. రైతుల కోసం చివరి వరకూ పోరాడుతానని మాటిచ్చా. ఇప్పుడు నాకేదో అయిపోతుందని మధ్యలో దీక్ష విరమించమనడం మీకూ మంచిది కాదు. ఈ జీవితంలో ఇక ఇంతకు మించిన తృప్తి మరేం ఉంటుంది. మీరు నా గురించి ఆలోచించవద్దు. జిల్లాల్లో ఆందోళనలను ఇంకా ఉధృతం చేయండి. ప్రభుత్వం ఇంకా ఎంత పట్టుదలకు పోతుందో నేనూ చూస్తా’నంటూ తనపై ఒత్తిళ్లు చేస్తున్న నాయకులకు స్పష్టం చేస్తున్నారు. దీనితో నేతలు నిస్సహాయంగా బయటకు వస్తున్నారు. వారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన చాలా నిదానంగా, నీరసంగా కనిపిస్తున్నారు.
బాబు ఆరోగ్య పరిస్థితి చివరకు ఎంత విషమ పరిస్థితికి చేరిందంటే.. ఆయన కాలకృత్యాలు తీర్చుకునేందుకు సైతం శరీరం సహకరించడం లేదు. సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్, సిబ్బంది ఆయనను నడిపిస్తున్నారు. ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. నీరసంగా ఉంటున్నందున ఆయనతో మాట్లాడేందుకు ఎవరినీ ఎక్కువ సేపు అనుమతించడం లేదు.కాగా, దీక్ష విరమించాలని బాబు నచ్చచెప్పడానికి పార్టీ సీనియర్లు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వారు ఆయన తనయుడు లోకేష్కు నచ్చచెప్పే ప్రయత్నాలు ప్రారంభించారు.
‘మనకు రైతులు ఎంత ముఖ్యమో, సార్ కూడా అంతే ముఖ్యం. మీరైనా దయచేసి ఆయనకు నచ్చచెప్పండ’ని అభ్యర్థించారు. అయితే, దానికి స్పందించిన లోకేష్ ‘నేను కూడా మీ అందరి మాదిరిగానే సైనికుడి లాంటివాడినే. ఆయన చెప్పిన దానిని ఫాలో చేయవలసిందే. మీరు చెప్పినా, నేను చెప్పినా ఆయన మాట వినరు. ప్రభుత్వం మళ్లీ స్పందించే వరకూ ఆయన దీక్ష విరమించనంటున్నారు’ అని వారికి స్పష్టం చేశారు. గత రెండురోజుల నుంచి బాబును పరామర్శించేందుకు వస్తున్న నాయకులకు లోకేషే ఆరోగ్య పరిస్థితి వివరిస్తున్నారు.
బాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నాయకులకు లోకేష్ ఎదురు ధైర్యం చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతర్గతంగా తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, నాయకులు పరామర్శకు వచ్చినప్పుడు మాత్రం చాలా మనోధైర్యంగా కనిపిస్తున్నారు.తానే వారికి ధైర్యం చెబుతున్నారు. పార్టీ సీనియర్లు యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు, నాగం జనార్దన్రెడ్డి, దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖరరెడ్డి, మోత్కుపల్లి నర్శింహులు, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, వేణుగోపాలచారి, రేవంత్రెడ్డి, పయ్యావుల కేశవ్, ప్రభాకర్, గరికపాటి మోహన్రావు, సీఎం రమేష్, తీగల కృష్ణారెడ్డి, వర్ల రామయ్య తదితర నేతలు ఉదయం నుంచీ రాత్రి వరకూ నిమ్స్లోనే ఉంటున్నారు.
నాగం జనార్దన్రెడ్డి తరచూ వైద్యులతో మాట్లాడి బాబు ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నారు.
గత పదేళ్ల నుంచి చంద్రబాబు నాయుడు క్రమం తప్పకుండా యోగా, ఇతర ఎక్సర్సైజులు చేస్తుండటం వల్లే ఆయన ఇప్పటివరకూ శారీరకంగా-మానసికంగా ధైర్యంగా ఉంటూ, అనారోగ్యాన్ని అధిగమించ గలుగుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ అయిదురోజులూ ఆయనను అవే కాపాడినప్పటికీ, ఇకపై అలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పలేమని, కనీసం ఫ్లూయిడ్స్ కూడా తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యం విషమంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
నేతల ఆందోళన- లోకేష్ అనునయింపు
కాగా నిమ్స్కు చేరుతున్న వివిధ జిల్లాల నేతలు బాబును పరామర్శించేందుకు వచ్చిన సమయంలో భావోద్వేగానికి గురయి కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా నేతలయితే బాబు ఆరోగ్య పరిస్థితి చూసి విలపిస్తున్నారు. అయితే, అక్కడే ఉన్న ఆయన కొడుకు లోకేష్ మాత్రం వారికి ధైర్యం చెబుతున్నారు. దేవుడు, ప్రజల ఆశీస్సుల వల్ల ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదని ధైర్యం చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు కూడా ఆయనను కలిశారు. రాష్ట్ర మహిళా నేతలు షకీలారెడ్డి, కుసుమ, సుప్రియ తదితరులు బాబు ఆరోగ్యంపై కలత చెందిన సందర్భంలో అక్కడే ఉన్న లోకేష్ వారికి ధైర్యం చెప్పారు.


No comments:
Post a Comment