ప్రకృతి వైఫరీత్యాలతో తీవ్ర నష్టాలపాలైన రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాజీలేని పోరాటం చేస్తామని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. తుపాన్ల ధాటికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చే విధంగా మిత్ర పక్షాలతో కలిసి గుంటూరులో గురువారం సాయంత్రం తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో ‘రైతు కోసం’ భారీ బహిరంగసభ జరిగింది. సభలో చంద్ర బాబునాయుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. కేంద్ర, రాష్ట్రాలు అవినీతిలో మునిగితేలుతున్నా యని ఆరుగాలం శ్రమించిన రైతు అకాల వర్షాలకు కుదే లైపోతే వారిని ఆదుకోకుండా ప్రభు త్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన తుపాన్ కారణంగా ఏర్పడిన తీవ్రనష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రైతులకు మేలు చేయడం కోసం తాము శాసనసభలోనూ బయట అనేక పోరాటాలు చేశామని ఆయన తెలియజేశారు. తెలంగాణా అంశంలో విద్యా ర్ధులపై కేసులను ఎత్తివేయాలని తాము శాసనసభ లో ప్రభుత్వాన్ని కోరితే మూడు రోజులపాటు సభను గందరగోళానికి గురిచేసిందన్నారు. విద్యార్ధులపై కేసులు ఎత్తేయాలని తాము శాసనసభలో ముందే కోరా మని అయితే అప్పుడు స్పందించని ప్రభుత్వం రైతుల కష్టా లపై పోరాటం చేస్తున్న తమపట నిర్ధాక్షిణ్యంగా వ్యవహ రించిందన్నారు. ప్రభుత్వం ఎంపిలు 24 గంటలు దీక్ష చేసేలోగా కేసులన్నీ ఎత్తి వేసిందన్నారు. రాష్ట్రంలో పంటల బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.
స్వామినాధన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాం డ్ చేశారు. చేనేతలను, కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని కూడా చంద్రబాబు డిమాండ్ చేశారు. రైతులు స్థైర్యం కోల్పోవద్దని, ఆత్మ హత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. రైతుల జీవితాల్లో వెలుగులు చూసేవరకు తాను మిత్రపక్షాలతో కలిసి రాజీ లేని పోరాటాన్ని చేయనున్నామని చంద్రబాబు తెలిపారు. రైతుల కష్టాలను తొలగించేందుకు జాతీయ స్థాయిలో ఉద్య మాలు చేయనున్నట్లు వెల్లడించారు. రైతుల పక్షంగా జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేయడానికి అతి త్వరలోనే ఒక నూతన సంస్థను ఏర్పాటుచేయనున్నట్లుగా చంద్ర బాబు ప్రకటించారు.
అవినీతిని అంతమొందించి పేదలులేని సమాజాన్ని చూడ డమే తన జీవితలక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో మునిగితేలుతూ పేదలకు కొద్దిగా సహాయం చేయమంటే స్పందించడం లేదని బాబు విమర్శిం చారు. 2జి స్పెక్ట్రమ్ కామవెల్త్ గేమ్ల నిర్వహణలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రైతులను ఆదు కోవడానికి ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చుచేయ డానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. అదే విధంగా అవినీతిపరుల జేబుల్లో నిండుతున్న సొమ్మును పేద రైతులకోసం ఖర్చు చేయాలని ఆయన అన్నారు.
అలాగే కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు ట్రిబ్యునల్ తీర్పుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. నీటి కేటాయింపులు సరిగా లేవని, రాష్ట్ర అవసరాలకు నీటి కోసం మరెవరో దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని అసహనం వ్యక్తంచేశారు.
రైతులకు దగ్గరయిన ‘దేశం’
రైతుల కోసం సంక్షేమనిధి : టీడీపీ
కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి తెలుగు దేశంపార్టీ సంక్షేమనిధి ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన రైతుకోసం సభావేదికపై ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్టీఆర్ మొమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నిధి ద్వారా తమవంతు సహాయాన్ని రైతులకు చేయడానికి కృషి చేస్తామని బాబు తెలిపారు. ఇక నుంచి రైతుకు చిన్న అన్యాయం జరిగినా సహించేది లేదని, ప్రభుత్వాన్ని నిలదీసి న్యాయం జరిగేవరకు టీడీపీ పోరాడుతుందని బాబు అన్నారు.రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల రాజకీయ పరిస్థితిలో గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో గురువారం టీడీపీ నిర్వహించిన ‘రైతుకోసం’ బహిరంగసభ విజయ వంతం కావడంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖుషీగా ఉన్నారు. అతి తక్కువ సమయంలోనే ఏర్పాట్లు చేసిన నేతలను ఆయన అభినందించారు. కోస్తా నేతలు సమీకరణను ప్రతిష్ఠాత్మకంగా భావించారు. నిజానికి, ఇప్పుడు నెలకొన్న పరిస్థితిలో 50 వేల మంది జనం వచ్చినా ఎక్కువేనన్న అంచనా పార్టీ నేతల్లో అంతర్గతంగా ఉంది. అయితే, లక్షమంది పట్టే స్టేడియం నిండిపోగా, అం దుకు రెండింతలు బయట, రోడ్లపై ఉండటం, సభ జరుగు తుండగానే ఇంకా వాహనాలు వస్తుండటం, దాదాపు 18 కిలోమీటర్లు ట్రాఫిక్ స్తంభించి పోవడంతో దాదాపు ఐదు గంటలు ప్రయాణీకులు ఇబ్బంది పడవలసి వచ్చింది. దీన్ని బట్టి జనం హాజరు ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.
రైతు సమస్యలపై జరిగిన ‘రైతుకోసం’ సభకు దేవెగౌడ, ప్రకాష్కరత్, బర్దన్, అజిత్సింగ్, చౌతాలా, బాబూలాల్ మరాండీ వంటి జాతీయ నేతలు హాజరయిన సభతో కోస్తాలో తెలుగుదేశం పార్టీకి పునరుజ్జీవం వచ్చినట్ట యింది. పార్టీకి మళ్లీ రైతుముద్ర వచ్చినట్టయింది. ఎన్టీఆర్ మృతి చెందకముందు వరకూ రైతు పార్టీగా ఉన్న టీడీపీకి, కోస్తాలో రైతులు బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబు రెండోసారి సీఎం అయిన తర్వాత కూడా సీట్లు బాగానే వచ్చినప్పటికీ, 2004 నుంచి తిరోగ మనం మొదలయింది. ఇప్పుడు మళ్లీ రైతుకోసం సభ విజయవంతంతో ఆ పార్టీ రైతులకు దగ్గరయినట్ట యింది. ఇది పార్టీ నేతలు, శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపింది.
అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడే గుంటూరు జిల్లా పార్టీ నేతలు, రైతుకోసం సభ విజయవంతానికి కలసికట్టుగా శ్రమించారు. గుంటూరులో ఎంపీ మోదుగుల, కోడెల, ధూళిపాళ్ల, పుల్లారావు, యరపతినేని, ఆంజనేయులు, ఆలపాటి రాజా సమన్వయంతో పనిచేయడం కలసివచ్చిం ది. పశ్చిమ గోదావరి జిల్లాలో మాగంటి బాబు ఆధ్వర్యంలో చేసిన తరలింపు ఏర్పాట్లు విజయవంతమయ్యాయి. కొవ్వూరు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల నుంచి భారీ జనసమీకరణ జరిగింది. డెల్టాలో కన్నా అప్ల్యాండ్ లోనే జన సమీకరణ బాగా జరిగి నట్లు కనిపిపించింది. గుంటూ రులో గరికపాటి, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు సమీక రణ బాధ్యత తీసుకోగా, యన మల-హరికృష్ణ నిర్వర్తించిన సమన్వయ బాధ్యతలు సఫలమయ్యాయి.
జగన్ పార్టీ నేపథ్యంలో.. పార్టీపరంగా, నాయకత్వ విబే ధాల కారణంతో కొంత బలహీనంగా ఉన్న కోస్తా ప్రాంతం లో ‘రైతుకోసం’ సభ విజయవంతం కావడం టీడీపీ శ్రేణు లకు టానిక్లా పరిణమించింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్ని కల్లో ఉత్సాహంగా పనిచేయటంతో పాటు, జగన్ పార్టీ వైపు పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు వెళ్లకుండా నిరోధించ డానికి దోహదపడింది. అదేవిధంగా కృష్ణా జిల్లా నుంచి సమీకరణ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో అక్కడ పార్టీపై దృష్టి సారించడానికి అవకాశం లభించింది. వైఎస్ మృతి నేపథ్యంలో ప్రత్యామ్నాయం లేని నేతగా ఆవిర్భవిం చిన బాబుపై కోస్తా రైతాంగం చూపిన ఆదరణ పరిశీలిస్తే, రానున్న రోజుల్లో కోస్తాప్రాంతంలో టీడీపీకి పూర్వవైభవం రావడం ఖాయమన్న ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.
మళ్లీ యనమల-గరికపాటి హిట్ కాంబినేషన్
టీడీపీ ‘రైతు కోసం’ సభకు సమయం తక్కువగా ఉండ టంతో ప్రధానంగా గుంటూరు-కృష్ణా-ప్రకాశం- పశ్చిమ గోదావరి-నల్లగొండ- ఖమ్మం జిల్లాలపైనే దృష్టి కేంద్రీక రించారు. అయితే, కృష్ణా-ప్రకాశం నుంచి ఆశించినంత సంఖ్యలో సమీకరణ కనిపించలేదు. గుంటూరు- ఖమ్మం వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో హాజరయ్యా రు. నల్లగొండ నుంచి జరిగిన సమీకరణ ఫర్వాలేదనిపిం చింది. దీనికోసం యనమల సారధ్యంలో హరికృష్ణ, గరిక పాటి మోహన్రావు రూపొందించిన ప్రణాళిక ఫలించింది. ప్రధానంగా యనమల-గరికపాటి కాంబినేషన్ మరోసారి హిట్టయింది.
గతంలో గుంటూరులోనే జరిగిన యువగర్జ న, రైతుగర్జన, రాజమండ్రి మహానాడుతో పాటు భారీసభ ల ఏర్పాట్లు కూడా వీరిద్దరి కాంబినేషన్లోనే హిట్టయిన విషయం తెలిసిందే. తాజాగా బాబు దీక్ష సందర్భంగా ఎమ్మెల్యే క్వార్టర్స్లో మూడుసార్లు తెల్లవారుఝామున పోలీసులను కార్యకర్తలు ప్రతిఘటించే వ్యూహానికి కూడా వీరిద్దరే వ్యూహకర్తలు కావడం విశేషం. కాకపోతే గుంటూరు ‘రైతుకోసం’ సభలో హరికృష్ణ తోడయ్యారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి గుంటూరు వేదిక వరకూ భారీ స్వాగత సన్నాహాలు ఏర్పాటుచేశారు. ఇవన్నీ కోస్తాలో టీడీపీ బలపడుతోందన్న భావనను కలిగించాయి.
14 అంశాలతో ‘రైతుకోసం డిక్లరేషన్’ ప్రకటన
భావసారూప్య పార్టీలతో కలిసి రాజీలేని పోరాటం చేస్తాం
ప్రభుత్వం స్పందించకున్నా ఆత్మహత్యలకు పాల్పడవద్దు
చివరి రక్తపుబొట్టు ఉన్నంతవరకూ మీ కోసమే పనిచేస్తా
చేతకాకపోతే ఎంపీలు రాజీనామా చేయాలి
కేంద్రంలో, రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. వ్యవసాయ పెట్టుబడులు, రైతు శ్రమ, భూమి విలువలను పరిగణనలోకి తీసుకొని వీటన్నింటిపై 50 శాతం లాభం ఉండేలా ఉత్పత్తులకు ధర నిర్ణయించాలన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన అఖిలపక్ష ‘రైతుకోసం’ సభలో ఆయన సదస్సు డిక్లరేషన్ను ప్రకటించారు. 14 అంశాలపై రైతుల కోసం సమావేశం ప్రకటిస్తున్న డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభకు జనతాదళ్ (ఎస్) అధ్యక్షుడు దేవెగౌడ, సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీపీఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, ఆర్.ఎల్.డి. అధినేత అజిత్సింగ్, ఇండియన్ నేషనల్ లోక్దళ్ అధినేత ఓంప్రకాశ్ చౌతాలా, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ, ఆర్.ఎస్.పి. నేత అభనిరాయ్, ఫార్వర్డ్బ్లాక్ నేత దేవరాజన్, ఎండీఎంకే నేత గణేష్మూర్తి, తదితర నేతలు హాజరయ్యారు.
సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ... ఇక్కడికి వచ్చిన జాతీయ స్థాయి నాయకులతో మరోసారి సమావేశమై, ఒక వ్యవస్థను ఏర్పాటుచేసుకొని దానికింద జాతీయ స్థాయిలో రాజీలేని పోరాటం చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం స్పందించకపోయినా నిరాశకులోనై ఆత్మహత్యలకు పాల్పడవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. మంచిరోజులొస్తాయని, రైతుల జీవితాల్లో వెలుగునింపేవరకు తామంతా కలిసిపోరాడతామని భరోసా ఇచ్చారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఎన్టీఆర్ స్ఫూర్తితో రైతు సమస్యలు పరిష్కారమయ్యేవరకు పోరాడతామని చెప్పారు. ‘ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డగా, మీ అన్నగా, తమ్ముడిగా చెబుతున్నా... చివరి రక్తపుబొట్టు వరకు మీ కోసమే పాటుపడతా..’ అని స్పష్టం చేశారు.
ఎంపీలూ! రైతుల కోసమూ దీక్ష చేయండి!!
ప్రస్తుత నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సుమారు 60 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే.. ప్రభుత్వం ఎకరానికి రూ. 2,400 ఇస్తామంటోందని తప్పుపట్టారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. ‘‘అసెంబ్లీలో కొట్లాడాం. ఈ ప్రభుత్వం స్పందించలేదు. రైతులకోసం జీవితంలో తొలిసారిగా నిరాహార దీక్షకు కూర్చున్నా. దీక్ష విరమించి కొద్దిగా కోలుకున్నాక ఇక్కడికి వచ్చా. నాకు గొంతు కూడా పెగలడం లేదు. కానీ మిమ్మల్ని చూశాక లేని శక్తిని కూడా కూడగట్టుకొని మాట్లాడుతున్నా. దిగాలుపడిన రైతాంగానికి న్యాయం జరగాలి. రైతులు రోజుకు 30 మంది చనిపోతున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 33 మంది ఎంపీలున్నారు. ఏం చేస్తున్నారు? రైతులకోసం నిరాహార దీక్ష చేయండి. చేతకాకపోతే రాజీనామా చేయండి.. కానీ రైతుకు అన్యాయం చేయొద్దు’’ అని విజ్ఞప్తి చేశారు.
కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు అధ్యయనం చేశాక కార్యాచరణ
మిగులు జలాలను కర్ణాటక, మహరాష్టల్రతో కలిసి పంచుకునే పరిస్థితి.. భవిష్యత్తులో రాష్ట్రాన్ని కరువు కోరల్లోకి నెట్టివేస్తుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఆలమట్టి ప్రాజెక్టు 524 మీటర్ల ఎత్తు కడతామంటే అప్పట్లో మా పోరాటంతో 519 మీటర్లకు కట్టడి చేశాం. ఇప్పుడు మళ్లీ ఎత్తు పెంచుకోవచ్చనే తీర్పు రావడం రాష్ట్రానికి కష్టకాలం. సరైన న్యాయవాదులను పెట్టుకోకపోవడం వల్లే తీర్పు మనకు వ్యతిరేకంగా వచ్చింది. దీనిపై గత ఏప్రిల్లో ప్రకాశం బ్యారేజీపై ధర్నా చేసి మరీ హెచ్చరించినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం’’ అని ఆయన తెలిపారు.
రైతు కోసం జాతీయ స్థాయి ఉద్యమం
రైతాంగ సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్వహించాలని, అందుకు గుంటూరులో జరిగిన ‘రైతుకోసం’ సభ నాంది పలకాలని వివిధ జాతీయ పార్టీల నేతలు ఉద్ఘాటించారు.
జాతీయ స్థాయిలో పోరాడాలి: రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. చంద్రబాబు దీక్ష నేపథ్యంలో మేమంతా కలిసి ప్రధాని దగ్గరికి వెళితే ముష్టివేసినట్టుగా రూ.400 కోట్లు ఇస్తామన్నారు. ఈ గుంటూరు సభ స్ఫూర్తిగా జాతీయస్థాయిలో మనమంతా ఉమ్మడిగా పోరాడాలి.
- ప్రకాశ్ కారత్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి
రైతుకివ్వడానికి మనసొప్పడం లేదు..: తమిళనాడులో ఎకరాకు నష్టపరిహారం రూ. 10 వేలు ఇస్తున్నారు. ఇక్కడ ఇవ్వడానికి మనసొప్పడం లేదు. దీనిపై భావసారూప్య పార్టీలతో కలిసి ఉద్యమిస్తాం.
- సురవరం సుధాకర్రెడ్డి, సీపీఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి
రైతులు తిరగబడాలి: సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వాలపై రైతులు ఉద్యమించి తిరగబడాలి. ఎన్డీయే, యూపీఏ హయాంలో 2 లక్షల 16 వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
- దేవెగౌడ, మాజీ ప్రధాని
రెండు పూటలా తినలేని పరిస్థితి: రైతుల పిల్లలు రెండుపూటలా తినలేని పరిస్థితిలో ఉన్నారు. వారికి విద్యాబుద్ధులు కూడా చెప్పించలేని పరిస్థితి. రైతాంగం పక్షాన ఐక్య ఉద్యమం నిర్మించాలి.
- బాబూలాల్ మరాండీ, జార్ఖండ్ మాజీ సీఎం
ఆంధ్ర, మహారాష్టల్ల్రోనే ఎక్కువ: రైతుల ఆత్మహత్యలు ఆంధ్ర, మహారాష్టల్ల్రో ఎక్కువ. 2010 కుంభకోణనామ సంవత్సరంగా మారింది. ఈ సభతోనైనా 2011 రైతు నామ సంవత్సరంగా మారాలి.
- అజిత్సింగ్, ఆర్ఎల్డీ అధినేత
నల్ల ఆంగ్లేయులు దోచుకుంటున్నారు: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెల్ల ఆంగ్లేయులు పో యి కాంగ్రెస్ నల్ల ఆంగ్లేయులు రైతును దోచుకుంటున్నారు. రైతన్న అధికారం పోరాడి సాధించుకోవాలి.
- ఓంప్రకాశ్చౌతాలా, ఐఎన్ఎల్డీ నేత
రైతే పెన్నిధి
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిధి ఏర్పాటు...
అధికారంలోకి వస్తే ప్రత్యేక బడ్జెట్
నా చివరి రక్తపు బొట్టూ రైతు సంక్షేమానికే...
ప్రాణం పోయినా వెనుకంజవేయను
రైతుకోసం సదస్సులో చంద్రబాబు.. కిక్కిరిసిన జనం, సభ సక్సెస్
పంట నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి...
గుంటూరు డిక్లరేషన్ విడుదల
ప్రధాని 400కోట్లు ముష్టి వేశారు: కరత్
కాంగ్రెస్ దోచుకుంటోంది: చౌతాలా
ఎన్డీయే, యూపీఏ రైతు వ్యతిరేక పార్టీలే: దేవెగౌడ
దేశవ్యాప్త పోరాటానికి ప్రతిన
ప్రాణం పోయినా.. ఆరోగ్యం చెడినా.. వెనుకంజ వేసే ప్రసక్తే లేదని.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపే వరకూ రాజీ లేని పోరాటం చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. తన చివరి రక్తపు బొట్టును కూడా రైతాంగ సంక్షేమానికే అర్పిస్తానని ప్రకటించారు. ఉద్యమ కేసులు ఎత్తివేయాలని దీక్షలు చేసిన ఎంపీలు.. రైతుల కోసం కూడా దీక్షలు చేస్తే సంతోషిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు ఉపయోగపడనప్పుడు ఎంపీలు రాజీనామాలు చేయడమే మంచిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది పార్టీల జాతీయ నేతలు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సమర శంఖం పూరించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. ఈ సారి రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గుంటూరులో గురువారం జరిగిన 'రైతు కోసం' సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగానే కాకుండా పార్టీపరంగా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రైతుల సంక్షేమానికి 'ప్రత్యేక నిధి'ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పేదరికం లేని సమాజాన్ని స్థాపించాలన్నదే తన ధ్యేయమన్నారు. రైతు సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ర్రాష్టాన్ని దోపిడీ చేసిందని విమర్శించారు.
ప్రభుత్వ భూములను అమ్మివేసి కోట్లాది రూపాయలను దోచుకున్నారని, దోచుకున్న డబ్బుతో పేపర్లు, టీవీలు పెట్టారని, సిమెంట్ కంపెనీలు నిర్మించారని, పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారంటూ పరోక్షంగా దివంగత సీఎం వైఎస్, ఆయన తనయుడు జగన్పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఆ డబ్బుతో రైతులను ఆదుకుంటే సంతోషించే వాడినని చెప్పారు. దోచుకున్న సొమ్మును కక్కించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. కేంద్రంలో కొందరు మంత్రులు తిమింగలాలుగా మారి ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కామన్వెల్త్ క్రీడల పేరుతో రూ.70 వేల కోట్లు ఖర్చు చేశారని, వందలాది కోట్లు మింగేశారని విమర్శించారు. వాటిలో రెండు వేల కోట్లను రైతుల కోసం ఖర్చు చేసేందుకు వారికి ప్రాణం ఒప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను పరిగణనలోకి తీసుకొని జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. 'కష్టాల్లో ఉన్న రైతన్నలను ఆదుకోవాలనే తలంపుతో నా జీవితంలో తొలిసారి నిరవధిక నిరాహార దీక్ష చేశాను. రైతుల కోసం చేస్తున్న పోరాటానికి ఇది అంతం కాదు. ఆరంభం మాత్రమే. నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఆరోగ్యం చెడినా వెరవను. రైతులకు న్యాయం జరిగే వరకు వెనుకంజ వేయను. నా చివరి రక్తపు బొట్టును సైతం రైతుల సంక్షేమానికే చిందిస్తా'' అన్నారు. రాష్ట్రం నుంచి 33 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నా రైతుల సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. విద్యార్థులపై మోపిన కేసులు ఎత్తివేయాలని దీక్షలు చేసిన ఎంపీలు రైతుల కోసం కూడా దీక్షలు చేస్తే సంతోషిస్తానని, తద్వారా వచ్చే కీర్తి కూడా వారే పొందవచ్చనని అన్నారు. సీఎం కిరణ్కుమార్ రెడ్డికి రైతుల పట్ల శ్రద్ధ లేదన్నారు.
తీర్పు చూశాక తదుపరి కార్యాచరణ
కృష్ణా మిగులు జలాల విషయంలో తాజాగా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిమూలంగా ఆంధ్రప్రదేశ్ కరువు రాష్ట్రంగా మారనుందని వాపోయారు. ట్రిబ్యునల్ నివేదిక చూసిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు




