నాగం పోటీ భేటీపై బాబు గుస్సా
తెలంగాణ నేతలతో సమావేశం
నాగం, కడియం, ఎర్రబెల్లికి అందని ఆహ్వానం
నేతల జోక్యంతో చల్లబడ్డ చంద్రబాబు
ప్రత్యేక శాఖకు ససేమిరా.. ఉద్యమాలకైతే ఓకే
తెలంగాణ నేతలతో సమావేశం
నాగం, కడియం, ఎర్రబెల్లికి అందని ఆహ్వానం
నేతల జోక్యంతో చల్లబడ్డ చంద్రబాబు
ప్రత్యేక శాఖకు ససేమిరా.. ఉద్యమాలకైతే ఓకే
తెలుగుదేశంలో 'తెలంగాణ' చిచ్చు రగిలింది! చప్పున చల్లారింది. అలకలు, ఆగ్రహాలతో సంక్షోభం సలసలా కాగింది! సాయంత్రానికి అంతా సర్దుకుంది! ఉదయం నుంచి సాయంత్రంలోపే... విషయం అనేక మలుపులు తిరిగింది. నాగం జనార్దన రెడ్డి కేంద్రంగా హైడ్రామా నడిచింది. ఆదివారం చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి గైర్హాజరైన నాగం, కడియం, ఎర్రబెల్లి పోటీ సమావేశం ఏర్పాటు చేయడంతో వేడి మొదలైంది. ఈ భేటీకి హాజరైన ఇతర నేతలందరినీ పిలిచి మాట్లాడిన చంద్రబాబు... ఆ ముగ్గురిని మాత్రం పిలవకుండా కఠిన వైఖరి ప్రదర్శించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
చివరికి... ఇతర నాయకులు సర్ది చెప్పడంతో ఆయన నాగం, కడియం, ఎర్రబెల్లిని పిలిచారు. 'ఇదేం పద్ధతి?' అంటూ ప్రశ్నించారు. తాను ఎంతగా సహకరిస్తున్నప్పటికీ, ఇలా ఇబ్బందులకు గురి చేయడం న్యాయమా? అని నిలదీశారు. చివరికి... పార్టీలో తెలంగాణ కోసం ప్రత్యేక శాఖ ప్రకటించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకుని ఉద్యమిస్తే అభ్యంతరం లేదని తెలిపారు. వెరసి... తెలుగుదేశంలో ఉదయం రగిలిన తుపాను సాయంత్రానికి చప్పున సద్దుమణిగినట్లయింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలుగుదేశంలో ఒక్కసారిగా చిచ్చు రగిలింది. భగభగమని మండింది. తర్వాత... చప్పున చల్లారింది. ఉదయం విషయం పార్టీలో చీలిక దాకా వెళ్లింది. రాత్రికి... అంతా సర్దుకుంది. మొత్తానికి... రోజంతా హైడ్రామా నెలకొంది. తెలంగాణ ప్రాంత ముఖ్య నేతలైన నాగం జనార్దన రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరి కేంద్రంగా వివాదం నడిచింది. నాగం కోరుతున్నట్లుగా తెలంగాణకు ప్రత్యేక శాఖ ప్రకటించడం సాధ్యంకాదని... ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఉద్యమించవచ్చని తేల్చిచెప్పారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రిదాకా అసలేం జరిగిందంటే...
ఆదివారం రాత్రి మూడు జిల్లాల పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు... దానికి ముందు తాజా రాజకీయ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు తెలంగాణకు చెందిన తొమ్మిది మంది నేతలను తన నివాసానికి ఆహ్వానించారు. వీరిలో పొలిట్బ్యూరో సభ్యులు, శాసనసభాపక్షం ఉప నేతలు, ముఖ్యులు ఉన్నారు. నాగం, కడియం, ఎర్రబెల్లి ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. పైగా... సరిగ్గా అదే సమయంలో నాగం గచ్చిబౌలిలోని తన నివాసంలో మరో సమావేశం నిర్వహించారు. దానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలను పిలిచారు.

హరీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఉమా మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, జైపాల్ యాదవ్, గంప గోవర్దన్, పి.రాములు, ఎల్లారెడ్డి, కెఎస్ రత్నం, కడియం శ్రీహరి తదితరులు నాగం నివాసానికి వచ్చారు. ఎర్రబెల్లి కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి గైర్హాజరై... అదే సమయంలో పోటీ సమావేశం ఏర్పాటు చేయడం కలకలం సృష్టించింది. పార్టీ అధినేతపై వీరు తిరుగుబాటు జెండా ఎగురవేశారని, తెలుగుదేశం పార్టీలో చీలిక వస్తోందని ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ఊహాగానాలు సాగాయి. పైగా... పార్టీ అధినేత అనుసరిస్తున్న వైఖరితో తాను విభేదిస్తున్నానని నాగం ఈ సమావేశంలో చెప్పారు.
తెలంగాణ సాధన కోసం ఉద్యమాలు నిర్వహించడానికి వీలుగా ప్రత్యేక రాష్ట్ర కమిటీ వేసేందుకు ఆయన అంగీకరించడం లేదని, ఉద్యమాలు చేయడంలో స్వేచ్ఛ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీంతో ఊహాగానాలకు మరిన్ని రెక్కలు తొడిగినట్లయింది. ఈ నేపథ్యంలో నాగం విలేకరులతో మాట్లాడారు. తనకు పార్టీని వీడే ఉద్దేశం లేదని... తమ నాయకుడు చంద్రబాబేనని స్పష్టం చేశారు. అయితే, తెలంగాణ సాధన కోసం ప్రత్యేక శాఖ కావాలని కోరుతున్నామన్నారు.
బాబు గుస్సా...
తాను పిలిచిన సమావేశానికి రాకపోగా అదే సమయంలో నాగం, కడియం కలిసి మరో సమావేశం నిర్వహించడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది. వారి విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని ఆయన నిర్ణయించుకున్నారు. నాగం ఇంట్లో జరిగిన సమావేశానికి వెళ్లిన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నగరంలో అందుబాటులో ఉన్న మరి కొందరు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్యులను ఆయన మధ్యాహ్నం తన నివాసానికి పిలిపించి వారితో భేటీ అయ్యారు.
నాగం, కడియం, ఎర్రబెల్లిని మాత్రం ఆహ్వానించలేదు. ఈ పరిణామం ముగ్గురు నేతలకు దిగ్భ్రమ కలిగించింది. తన నివాసానికి వచ్చిన తెలంగాణ నేతలతో చంద్రబాబు సుమారు మూడు గంటలపాటు సమావేశం అయ్యారు. ఇక్కడి రాజకీయ పరిస్థితి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. "తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అసెంబ్లీలో నేను స్వయంగా మూడు రోజులపాటు డిమాండ్ చేశాను. టీఆర్ఎస్ వారికంటే ఎక్కువ మాట్లాడాను.
శ్రీకృష్ణ నివేదికపై కేంద్ర హోం శాఖ నిర్వహిస్తున్న సమావేశానికి వెళ్లాలని కోస్తా ప్రాంత నేతలు కొందరు కోరినా... వారిని వారించి మీరు కోరిన ప్రకారం ఆ సమావేశానికి వెళ్లలేదు. శ్రీకృష్ణ నివేదిక వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నప్పుడు తామూ చేస్తామని సీమాంధ్ర నేతలు నాతో చెప్పారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని వారికి నచ్చజెప్పి ఆపాను. నేను మీ గురించి ఆలోచిస్తున్నంతగా మీరు నా గురించి ఆలోచిస్తున్నారా? కాంగ్రెస్ నేతలు ఏనాడూ సోనియా గాంధీ ప్రస్తావన తేరు.
మీరు ప్రతిదానికి నా ప్రస్తావన తెచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం న్యాయమేనా?'' అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తాము రాష్ట్ర సాధన కోసం ఉద్యమించాల్సి ఉందని కొందరు ఎమ్మెల్యేలు చెప్పారు. దీనిపై బాబు స్పందిస్తూ... "నిరభ్యంతరంగా ఉద్యమించవచ్చు. దీనిపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు. అయితే, ఎవరికి వారుగా కాకుండా ఒక కమిటీ వేసుకొని ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి.
గందరగోళానికి తావివ్వవద్దు'' అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి పార్టీలో విడిగా ఒక శాఖ ఏర్పాటు మాత్రం సాధ్యం కాదని బాబు తేల్చిచెప్పారు. "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇస్తున్న బీజేపీ, సీపీఐగానీ... కాంగ్రెస్ పార్టీ గానీ తెలంగాణకు ప్రత్యేక శాఖలు పెట్టాయా? ఎక్కడా లేని శాఖ మన వద్ద కావాలని కోరడం సరికాదు. దానివల్ల తప్పుడు సంకేతాలు వెళతాయి. దాని బదులు మీరంతా కలిసి ఏదైనా ఒక కమిటీ వేసుకొని దాని ఆధ్వర్యంలో మీ కార్యక్రమాలు నిర్వహించుకోండి'' అని సూచించారు.
నా బాధ్యత కాదా?
ఈ సమావేశం జరుగుతుండగానే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు రంగ ప్రవేశం చేశారు. ఏ సమస్య ఎలా ఉన్నా భేటీకి నాగం, కడియం, ఎర్రబెల్లిని పిలవకపోవడం సరికాదని... వారిని కూడా పిలవాలని చంద్రబాబును కోరారు. దీంతో ఆయన మెత్తబడ్డారు. ఆ ముగ్గురినీ తన నివాసానికి ఆహ్వానించారు. రాత్రి ఏడు గంటల సమయంలో వారు బాబు వద్దకు వచ్చారు. వారితో ఆయన సూటిగానే మాట్లాడారు. "మీరు ముగ్గురూ పొలిట్బ్యూరో సభ్యులు.
ఉదయం నేను పిలిస్తే రాకపోగా, అదే సమయంలో మరో సమావేశం నిర్వహిస్తే చూసే వారికి ఎలా ఉంటుంది? సీనియర్లుగా మీరు నన్ను గైడ్ చేయాలి. నా దగ్గరకు వచ్చి ఎంతైనా కొట్లాడండి. తప్పులేదు. కానీ, సమావేశాలకు రాకపోవడం ఏం పద్ధతి? ఇలా అయితే పార్టీ నడుస్తుందా?'' అని ఆయన వారిని ప్రశ్నించారు. అక్కడకు వెళ్లి వద్దామనుకొన్నామని కడియం, ఎర్రబెల్లి వివరణ ఇచ్చారు. మరి ఎందుకు రాలేదని చంద్రబాబు అడిగినప్పడు వారు మౌనం వహించారు. పార్టీని రక్షించుకోవడానికే తాపత్రయపడుతున్నామని నాగం అన్నారు.
"పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత అధ్యక్షుడిగా నాకు లేదా? ఏమీ పట్టకుండా ఉంటానా? నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఒకసారి నాది తప్పు కావచ్చు. మరోసారి మీది తప్పు కావచ్చు. అంతమాత్రాన ఎదుటివారు అన్నీ తప్పులే చేస్తున్నారని నిందలు వేయడం సరికాదు. మీరు ఒక కోణంలో చూస్తే నేను నాలుగు కోణాల నుంచి చూస్తుంటాను'' అని బాబు వ్యాఖ్యానించారు.
తాను జిల్లాల పర్యటన నుంచి వచ్చిన తర్వాత మరోసారి కూర్చుని విపులంగా చర్చించుకొందామని... రైలుకు సమయం సమీపిస్తోందని బాబు చెప్పడంతో చర్చ అంతటితో ముగిసింది. తాము ఈ నెల 13వ తేదీన మరోసారి కూర్చుని అన్నీ చర్చించుకొంటామని ఈ సమావేశం తర్వాత ఎర్రబెల్లి విలేకరులతో చెప్పారు. నాగం మీడియాతో ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. మొత్తంగా చూస్తే... నాగంలో సంతృప్తి కనిపించలేదని, ఆయన వైఖరి అస్థిమితంగానే ఉందని కొందరు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. వ్యవహారం 'టీ కప్పులో తుపాను'గా ముగిసిందని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.
చివరికి... ఇతర నాయకులు సర్ది చెప్పడంతో ఆయన నాగం, కడియం, ఎర్రబెల్లిని పిలిచారు. 'ఇదేం పద్ధతి?' అంటూ ప్రశ్నించారు. తాను ఎంతగా సహకరిస్తున్నప్పటికీ, ఇలా ఇబ్బందులకు గురి చేయడం న్యాయమా? అని నిలదీశారు. చివరికి... పార్టీలో తెలంగాణ కోసం ప్రత్యేక శాఖ ప్రకటించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకుని ఉద్యమిస్తే అభ్యంతరం లేదని తెలిపారు. వెరసి... తెలుగుదేశంలో ఉదయం రగిలిన తుపాను సాయంత్రానికి చప్పున సద్దుమణిగినట్లయింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలుగుదేశంలో ఒక్కసారిగా చిచ్చు రగిలింది. భగభగమని మండింది. తర్వాత... చప్పున చల్లారింది. ఉదయం విషయం పార్టీలో చీలిక దాకా వెళ్లింది. రాత్రికి... అంతా సర్దుకుంది. మొత్తానికి... రోజంతా హైడ్రామా నెలకొంది. తెలంగాణ ప్రాంత ముఖ్య నేతలైన నాగం జనార్దన రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, కడియం శ్రీహరి కేంద్రంగా వివాదం నడిచింది. నాగం కోరుతున్నట్లుగా తెలంగాణకు ప్రత్యేక శాఖ ప్రకటించడం సాధ్యంకాదని... ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఉద్యమించవచ్చని తేల్చిచెప్పారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రిదాకా అసలేం జరిగిందంటే...
ఆదివారం రాత్రి మూడు జిల్లాల పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు... దానికి ముందు తాజా రాజకీయ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు తెలంగాణకు చెందిన తొమ్మిది మంది నేతలను తన నివాసానికి ఆహ్వానించారు. వీరిలో పొలిట్బ్యూరో సభ్యులు, శాసనసభాపక్షం ఉప నేతలు, ముఖ్యులు ఉన్నారు. నాగం, కడియం, ఎర్రబెల్లి ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. పైగా... సరిగ్గా అదే సమయంలో నాగం గచ్చిబౌలిలోని తన నివాసంలో మరో సమావేశం నిర్వహించారు. దానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలను పిలిచారు.

హరీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఉమా మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, జైపాల్ యాదవ్, గంప గోవర్దన్, పి.రాములు, ఎల్లారెడ్డి, కెఎస్ రత్నం, కడియం శ్రీహరి తదితరులు నాగం నివాసానికి వచ్చారు. ఎర్రబెల్లి కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి గైర్హాజరై... అదే సమయంలో పోటీ సమావేశం ఏర్పాటు చేయడం కలకలం సృష్టించింది. పార్టీ అధినేతపై వీరు తిరుగుబాటు జెండా ఎగురవేశారని, తెలుగుదేశం పార్టీలో చీలిక వస్తోందని ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ఊహాగానాలు సాగాయి. పైగా... పార్టీ అధినేత అనుసరిస్తున్న వైఖరితో తాను విభేదిస్తున్నానని నాగం ఈ సమావేశంలో చెప్పారు.
తెలంగాణ సాధన కోసం ఉద్యమాలు నిర్వహించడానికి వీలుగా ప్రత్యేక రాష్ట్ర కమిటీ వేసేందుకు ఆయన అంగీకరించడం లేదని, ఉద్యమాలు చేయడంలో స్వేచ్ఛ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీంతో ఊహాగానాలకు మరిన్ని రెక్కలు తొడిగినట్లయింది. ఈ నేపథ్యంలో నాగం విలేకరులతో మాట్లాడారు. తనకు పార్టీని వీడే ఉద్దేశం లేదని... తమ నాయకుడు చంద్రబాబేనని స్పష్టం చేశారు. అయితే, తెలంగాణ సాధన కోసం ప్రత్యేక శాఖ కావాలని కోరుతున్నామన్నారు.
బాబు గుస్సా...
తాను పిలిచిన సమావేశానికి రాకపోగా అదే సమయంలో నాగం, కడియం కలిసి మరో సమావేశం నిర్వహించడం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది. వారి విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని ఆయన నిర్ణయించుకున్నారు. నాగం ఇంట్లో జరిగిన సమావేశానికి వెళ్లిన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నగరంలో అందుబాటులో ఉన్న మరి కొందరు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్యులను ఆయన మధ్యాహ్నం తన నివాసానికి పిలిపించి వారితో భేటీ అయ్యారు.
నాగం, కడియం, ఎర్రబెల్లిని మాత్రం ఆహ్వానించలేదు. ఈ పరిణామం ముగ్గురు నేతలకు దిగ్భ్రమ కలిగించింది. తన నివాసానికి వచ్చిన తెలంగాణ నేతలతో చంద్రబాబు సుమారు మూడు గంటలపాటు సమావేశం అయ్యారు. ఇక్కడి రాజకీయ పరిస్థితి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. "తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అసెంబ్లీలో నేను స్వయంగా మూడు రోజులపాటు డిమాండ్ చేశాను. టీఆర్ఎస్ వారికంటే ఎక్కువ మాట్లాడాను.
శ్రీకృష్ణ నివేదికపై కేంద్ర హోం శాఖ నిర్వహిస్తున్న సమావేశానికి వెళ్లాలని కోస్తా ప్రాంత నేతలు కొందరు కోరినా... వారిని వారించి మీరు కోరిన ప్రకారం ఆ సమావేశానికి వెళ్లలేదు. శ్రీకృష్ణ నివేదిక వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నప్పుడు తామూ చేస్తామని సీమాంధ్ర నేతలు నాతో చెప్పారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని వారికి నచ్చజెప్పి ఆపాను. నేను మీ గురించి ఆలోచిస్తున్నంతగా మీరు నా గురించి ఆలోచిస్తున్నారా? కాంగ్రెస్ నేతలు ఏనాడూ సోనియా గాంధీ ప్రస్తావన తేరు.
మీరు ప్రతిదానికి నా ప్రస్తావన తెచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం న్యాయమేనా?'' అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తాము రాష్ట్ర సాధన కోసం ఉద్యమించాల్సి ఉందని కొందరు ఎమ్మెల్యేలు చెప్పారు. దీనిపై బాబు స్పందిస్తూ... "నిరభ్యంతరంగా ఉద్యమించవచ్చు. దీనిపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు. అయితే, ఎవరికి వారుగా కాకుండా ఒక కమిటీ వేసుకొని ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి.
గందరగోళానికి తావివ్వవద్దు'' అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి పార్టీలో విడిగా ఒక శాఖ ఏర్పాటు మాత్రం సాధ్యం కాదని బాబు తేల్చిచెప్పారు. "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇస్తున్న బీజేపీ, సీపీఐగానీ... కాంగ్రెస్ పార్టీ గానీ తెలంగాణకు ప్రత్యేక శాఖలు పెట్టాయా? ఎక్కడా లేని శాఖ మన వద్ద కావాలని కోరడం సరికాదు. దానివల్ల తప్పుడు సంకేతాలు వెళతాయి. దాని బదులు మీరంతా కలిసి ఏదైనా ఒక కమిటీ వేసుకొని దాని ఆధ్వర్యంలో మీ కార్యక్రమాలు నిర్వహించుకోండి'' అని సూచించారు.
నా బాధ్యత కాదా?
ఈ సమావేశం జరుగుతుండగానే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు రంగ ప్రవేశం చేశారు. ఏ సమస్య ఎలా ఉన్నా భేటీకి నాగం, కడియం, ఎర్రబెల్లిని పిలవకపోవడం సరికాదని... వారిని కూడా పిలవాలని చంద్రబాబును కోరారు. దీంతో ఆయన మెత్తబడ్డారు. ఆ ముగ్గురినీ తన నివాసానికి ఆహ్వానించారు. రాత్రి ఏడు గంటల సమయంలో వారు బాబు వద్దకు వచ్చారు. వారితో ఆయన సూటిగానే మాట్లాడారు. "మీరు ముగ్గురూ పొలిట్బ్యూరో సభ్యులు.
ఉదయం నేను పిలిస్తే రాకపోగా, అదే సమయంలో మరో సమావేశం నిర్వహిస్తే చూసే వారికి ఎలా ఉంటుంది? సీనియర్లుగా మీరు నన్ను గైడ్ చేయాలి. నా దగ్గరకు వచ్చి ఎంతైనా కొట్లాడండి. తప్పులేదు. కానీ, సమావేశాలకు రాకపోవడం ఏం పద్ధతి? ఇలా అయితే పార్టీ నడుస్తుందా?'' అని ఆయన వారిని ప్రశ్నించారు. అక్కడకు వెళ్లి వద్దామనుకొన్నామని కడియం, ఎర్రబెల్లి వివరణ ఇచ్చారు. మరి ఎందుకు రాలేదని చంద్రబాబు అడిగినప్పడు వారు మౌనం వహించారు. పార్టీని రక్షించుకోవడానికే తాపత్రయపడుతున్నామని నాగం అన్నారు.
"పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత అధ్యక్షుడిగా నాకు లేదా? ఏమీ పట్టకుండా ఉంటానా? నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఒకసారి నాది తప్పు కావచ్చు. మరోసారి మీది తప్పు కావచ్చు. అంతమాత్రాన ఎదుటివారు అన్నీ తప్పులే చేస్తున్నారని నిందలు వేయడం సరికాదు. మీరు ఒక కోణంలో చూస్తే నేను నాలుగు కోణాల నుంచి చూస్తుంటాను'' అని బాబు వ్యాఖ్యానించారు.
తాను జిల్లాల పర్యటన నుంచి వచ్చిన తర్వాత మరోసారి కూర్చుని విపులంగా చర్చించుకొందామని... రైలుకు సమయం సమీపిస్తోందని బాబు చెప్పడంతో చర్చ అంతటితో ముగిసింది. తాము ఈ నెల 13వ తేదీన మరోసారి కూర్చుని అన్నీ చర్చించుకొంటామని ఈ సమావేశం తర్వాత ఎర్రబెల్లి విలేకరులతో చెప్పారు. నాగం మీడియాతో ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. మొత్తంగా చూస్తే... నాగంలో సంతృప్తి కనిపించలేదని, ఆయన వైఖరి అస్థిమితంగానే ఉందని కొందరు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. వ్యవహారం 'టీ కప్పులో తుపాను'గా ముగిసిందని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.
పోతే.. పోండి
కాంగ్రెస్ నాయకత్వం లోని యుపీఏ సర్కారు వేసిన శ్రీ కృష్ణ కమిటీ తన నివేది లో అస్పష్ట వైఖరి ప్రద ర్శించిన సమయంలో అంతా కలసి కాంగ్రెస్పై దాడి చేయవలసిన సమయంలో సొంత పార్టీ నేతలే అభద్రతా భావానికి గురయి సొంత నిర్ణయాలు తీసుకుంటే అవస రమైతే అలాంటి వారిని వదులుకోవడా నికి సైతం సిద్ధంగా ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశా రు. తెలంగాణపై అవసరమైతే ఇంకా ఉధృత మైన ఉద్యమాలు చేయాలని, అంతే గానీ పార్టీ ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహిం చేది లేదని బాబు హెచ్చరించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీనే తెలంగాణపై గం దరగోళంలో ఉంటే, ప్రాంతీయ పార్టీ అయిన మనం ఇంకెంత ఆచితూచి నిర్ణయం తీసుకోవా లో మీరే ఆలోచించండన్నారు.
ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ నాటకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో జరిగిన సంఘటనలో వార్తల్లో వ్యక్తులుగా నిలిచిన సీనియర్ నేతలయిన నాగం జనార్దన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, కడియం శ్రీహరి రాత్రి సమయంలో బాబును కలసి, తామంతా పార్టీలోనే ఉంటామని, మీరు జిల్లా పర్యటనలు పూర్తి చేసుకుని రావాలని కోరడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకున్న వ్యవహారాలు చివరకు ‘టీ’ కప్పులో తుపానులా ముగిశాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకా రం... శనివారం నాగం నేతృత్వంలో ముఖ్యమంత్రిని కలసి ఉస్మానియాలో మోహరించిన బలగాలను తొలగించాలని కోరిన టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలకు ఆదివారం తన నివాసంలో బ్రేక్ఫాస్టుకు రావాలని నాగం ఆహ్వానించారు.
అయితే, అదే సమయంలో బాబు తన నివాసంలో పది మంది సీనియర్లను ఆహ్వానించారు. వారిలో నాగం, కడియం, ఎర్రబెల్లి కూడా ఉన్నా రు. అయితే, తాను ఆసుపత్రికి వెళుతున్నందున సమావేశానికి రానని దయా కర్ చెప్పగా, తాను-నాగం కలసి అర్ధగంటలో వస్తామని కడియం చెప్పారు. నాగం మాత్రం తాను రాలేనని చెప్పారు. అప్పటికే బాబు నివాసంలో టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్, మోత్కుపల్లి నర్శింహులు, దేవేందర్గౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్ వంటి నేతలు చేరుకున్నారు.
తనకు రెండు ప్రాంతాల్లోనూ పార్టీని కాపాడుకోవలసిన అవసరం ఉందని, శ్రీ కృష్ణ కమిటీ తన అస్పష్టమైన తీర్పు ద్వారా రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసిన వైనాన్ని వినియోగించుకుని కాంగ్రెస్పై కలసికట్టుగా దాడి చేయవలసిన సమయంలో మన వాళ్లే టీఆర్ఎస్ ట్రాప్లో పడితే ఎలాగని బాబు వ్యాఖ్యా నించారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించకూడదని, అవసరమైతే కొందరు పార్టీని వీడినా ఫర్వాలేదని బాబు వ్యాఖ్యానించారు.మిగిలిన నాయకులు కూడా మనం కాంగ్రెస్-టీఆర్ఎస్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించేందుకు ఇదే తగిన సమయమన్నారు. ఉదయం నుంచి మూడు గంటల వరకూ టీవీలలో వస్తున్న స్క్రోలింగులు, వార్తా కథనాలను సమావేశం లోనే చూసిన నాయకులు దీనివల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక శాఖ ఏర్పాటుచేయకపోతే తమ దారి తాము చూసుకుంటామని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు వేడిపుట్టించాయి. టీఆర్ఎస్ నేతలు జితేందర్రెడ్డి, విజయరామారావు ఆ ముగ్గురుతో మాట్లాడారన్న వార్తలతో ఒక్కసారిగా వాతావరణం సీరియస్గా మారింది.
మళ్లీ అదే సమయంలో తామంతా బాబు నాయతక్వంలోనే పనిచేస్తామని, తాము పార్టీని వీడేది లేదని, తెలంగాణకు ప్రత్యేక శాఖ ఉండాల్సిందేనని నాగం కడియం స్పష్టం చేశారు. తమపై బాబు సీరియస్ అయి.. పార్టీలో ఉండేవారు ఉంటారు పోయేవారు పోతారని వ్యాఖ్యానించారంటూ స్క్రోలింగులలో రావడంతో ఆ ముగ్గురూ సీరియస్ అయ్యారన్న వార్తలతో దృష్టి అటు మళ్లింది. తెలంగాణలో పార్టీని పటిష్ఠం చేసుకునేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొందరు నేతలు సూచించగా, బాబు దానికి సానుకూలంగా స్పందించారు. దీనిపై తాను జిల్లాల పర్యటనలు ముగించుకుని వచ్చిన తర్వాత చర్చించి ఒక నిర్ణయం తీసుకుందామని అన్నారు.
పార్టీ తీసు కోవలసి నిర్ణయాలపై నాగం నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యేలను కూడా పిలిపించి, సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే, ఆ సమావేశానికి నాగం, కడియం, ఎర్రబెల్లిని ఆహ్వానించలేదు. అది టీవీ చానెళ్లకు ఒక వార్తగా మారింది. ఇదిలాఉండగా, బాబు సీనియర్ నాయ కులతో భేటీ అయిన తర్వాత మూడు గంటల సమయంలో ఎర్రబెల్లి దయాకర్ ఒక్కరే వచ్చి బాబుతో ఏకాంతంగా కలసి, ఉదయం నాటి పరిణామాలను వివరించడం గమనార్హం. తాను మీతోనే ఉంటానని, తనకు సొంత అజెండా లేదని, టీవీ వార్తలను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఆ తర్వాత నాలుగు గంటల కు తెలంగాణ ఎమ్మెల్యేలంతా బాబు నివాసంలో భేటీ అయ్యారు.
ఉదయం నా గం నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యేంతా ఈ సమావేశానికి హాజరుకా డం గమనా ర్హం. వారితో బాబు సుదీర్ఘంగా మాట్లాడారు. ‘మనం ఉస్మానియా విద్యార్థులపై పెట్టిన కేసులు తొలగించాలని అసెంబ్లీలో గొడవ చేశాం. నేను వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ప్రభుత్వాన్ని నిలదీశా. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయా లని డిమాండ్ చేశా. అయినా ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలు ఒక్కరోజు దీక్ష చేస్తే విద్యార్థులపై కేసులు తొలగించింది. మనం కౌన్సిల్ను వ్యతి రేకించినా కాంగ్రెస్ సాధించుకుంది. నేను 9 రోజులు రైతుల కోసం దీక్ష చేస్తే స్పందించని ప్రభు త్వం, ఆ తర్వాత ఏదో కొన్ని ప్యాకేజీలిచ్చింది. దీన్ని బట్టి కాంగ్రెస్ రాజకీయ ప్ర యోజనాల మేరకే పనిచేస్తుందని అర్థమవుతోంది. వ్యక్తిగ తంగా నేను తెలంగా ణకు వ్యతిరేకం కాదు. అసలు తెలంగాణను తెచ్చే శక్తి గానీ, అడ్డుకునే శక్తి గానీ మనకు లేదు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఇబ్బందిలో పడింది. కాంగ్రెస్ను తిట్టా లో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారు. ఈ పరిస్థితిని మనం వినియోగించుకుని కాంగ్రెస్ -టీఆర్ఎస్పై ఎదురుదాడి చేయవలసిన సమయంలో, మన వాళ్లే టీఆర్ఎస్ వాళ్ల ట్రాప్లో పడితే ఎలా? తెలంగాణ కోసం ఇంకా ఎన్ని ఉద్యమాలయినా ఉధృతంగా చేయండి. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పార్టీ ప్రయో జనాలు కాదని, వ్యక్తిగత అజెండాలు పెట్టుకుంటే సహించేది లేదు. కాకపోతే కొంతమంది పార్టీ నుంచి వెళతారు. వెళ్లనీయండి. నాకు పార్టీ ముఖ్యం. నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? చెప్పండి! నేను చేస్తున్నది కరెక్టా కాదా మీరే చెప్పండి’ అని వ్యాఖ్యానించారు.
దీనితో ఉదయం నాగం నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యేలు కొందరు ఉదయం సమావేశానికి మీ అనుమతి ఉందని చెప్పే నాగం తమను పిలిచారని బాబు దృష్టికి తీసుకువెళ్లారు. నిజానికి తాము అక్కడ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది కూడా ఏమీ లేదని, తెలంగాణకు ప్రత్యేక శాఖ ఉంటే బాగుంటుందని, అప్పుడే తమను ప్రజలు తమను నమ్ముతారని మాత్ర మే చర్చ జరిగిందన్నారు. తామంతా మీ తోనే ఉంటామని, తమకు ఎలాంటి సొంత అజెండా లేదని, పార్టీ బాగుంటునే తాము బాగుంటామన్నారు. అదే సమ యంలో.. బాబు ఆ ముగ్గురిపై ఆగ్రహం వ్యక్తం చేశారని, పార్టీలో ఉంటే ఉండండి, పోతే పొండన్నారంటూ టీవీ స్క్రో లింగులు రావటం కూడా అబద్ధమ ని ఉదయం బాబు భేటీలో ఉన్న నేతలు ఎమ్మెల్యేలకు స్పష్టం చేయటంతో పరి స్థితి సర్దుమణిగింది.
ఈ క్రమంలో నాగం, ఎర్రబెల్లి, కడియం శ్రీహరిని కూడా మీటింగుకు పిలవాలని రేవూరి ప్రకాష్రెడ్డి సూచించగా, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ దానిని బలపరిచారు. ఆ దశలో జోక్యం చేసుకున్న చంద్రబాబు నాయుడు ‘నేను వారిని ఉదయం పదిమంది తో పాటు ఆహ్వానించా. కానీ రాలేదు. అది చానళ్లలో వేరే సంకేతాలు వెళ్లాయి, చంద్రబాబు పిలిచినా వాళ్లు రాలేదన్న సంకేతాలు వెళ్లాయి. అందుకే ఇప్పుడు ఈ సమావేశానికి వారిని పిలవలేదు. ఒక వేళ మళ్లీ పిలిచినా వాళ్లు రాకపోతే నాకు ఎలాంటి గౌరవం ఉంటుందో, ఎలాంటి సంకేతాలు వెళతాయో మీరే ఆలో చించండి. వారిని అవాయిడ్ చేయాలని నాకు లేదు. వాళ్లు పొలిట్బ్యూరో సభ్యు లన్న గౌరవంతోనే ఉదయం పిలిచా. ఇప్పుడు మీరు చెబుతున్నారు కాబట్టి పిలు స్తున్నా’నని వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత బాబు ఆ ముగ్గురితో ఫోన్లో మాట్లాడి, సమావేశానికి రావాలని ఆదేశించారు. దానితో ఆ ముగ్గురూ సమా వేశానికి హాజరయ్యారు. బాబు మీపు ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు అబద్ధ మని అక్కడే ఉన్న సీనియర్లు ఆ ముగు ్గరికీ స్పష్టం చేశారు. వచ్చీ రాగానే నాగం తెలం గాణకు ప్రత్యేక శాఖ గురించి ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయి తే ఆయనతో పాటు వచ్చిన కడియం శ్రీహరి మాత్రం నాగంతో విభేదించారు. ‘మీరు ఈరోజు టూర్కు వెళుతున్నారు కదా సార్. టూర్ పూర్తి చేసుకుని 13న వస్తారు కాబట్టి అప్పుడు కూర్చుని నిర్ణయిద్దాం’ అని స్పష్టం చేయడంతో నాగం మౌనం వహించారు. నాగం తీరు తెలంగాణ శాఖపై అప్పటికప్పుడు ఏదో ఒకటి తేల్చాలన్న ధోరణిలోనే ఉందని నేతలు చెప్పారు. కడియం శ్రీహరి సూచ ననను అంతా అంగీకరించడంతో 13న మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు. సమావేశం ముగిసి, బాబు పశ్చిమ గోదావరి జిల్లా యాత్రకు వెళ్లేందుకు సిద్ధమ యేందుకు కారు వద్దకు వెళ్లగా, కడియం శ్రీహరి ఆయనతో కొద్దిసేపు మంతనాలు జరపడం ప్రస్తావనార్హం.
టీడీపీలో తెలంగాణ హైడ్రామా
| |
‘స్పెషల్’ ఎఫెక్ట్
శ్రీకృష్ణ నివేదికపై చర్చకు ఇంటికి రమ్మన్న బాబు
తెలంగాణ టీడీపీ శాఖ కోసం నాగం వర్గం పట్టు
బాబు నివాసానికి వచ్చేందుకు ససేమిరా...
ప్రత్యేక శాఖ ఇస్తేనే వస్తామని పేచీ
నో అన్న బాబు.. ఉద్యమాలు చేసుకోండి, శాఖ అక్కర్లేదని సూచన... వారిని వదులుకునేందుకు కూడా సిద్ధమని
మీడియాకు లీకులు
చంద్రబాబు, నాగంల సారథ్యంలో రెండు గ్రూపులుగా
సమావేశాలు... తెరపైకి సమన్వయ కమిటీ
తర్వాత బాబు ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వచ్చిన నాగం వర్గం... ఎటూ తేలని భేటీ; మళ్లీ 13న చర్చ
తెలుగుదేశం పార్టీలో తెలంగాణ వేడి మరింత రాజుకుంది. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో ఆ ప్రాంతానికి చెందిన నాయకులు ఆదివారం రోజంతా హైడ్రామా నడిపారు. ఉదయం నుంచి రాత్రి తొమ్మిదిగంటల వరకు సాగిన ఈ ఎపిసోడ్ ఆద్యంతం రక్తి కట్టించింది. రోజంతా జరిగిన హైడ్రామాలో నాగం వర్గాన్ని వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు సన్నిహితుల నుంచి సంకేతాలు వెళ్లడం తెలంగాణ నేతల్లో కలకలం రేపింది. నాగం వర్గం డిమాండ్ చేసినంత మాత్రాన తెలంగాణకు ప్రత్యేక శాఖ ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఇతర ప్రాంతాల నేతలు ప్రశ్నించడంతో చివరకు తెలంగాణ ఆందోళన కోసం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో కథ తాత్కాలికంగా వాయిదా పడింది. విశ్వసనీయ సమాచారం మేరకు... జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తదనంతర పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు నిర్వహించాల్సిన పాత్ర, పార్టీ తరఫున కార్యాచరణ తయారుచేసేందుకు గాను తన నివాసానికి రావాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలోని ముఖ్యనేతలకు సమాచారం ఇచ్చారు.
ఈ సమావేశానికి ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేశ్రాథోడ్, సీనియర్ నాయకుడు దేవేందర్గౌడ్, ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తదితరులు హాజరయ్యారు. అయితే పార్టీ సీనియర్లు నాగం, కడియం, ఎరబ్రెల్లిలు తాము ఈ సమావేశానికి రావడం లేదని, తెలంగాణకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తేనే వస్తామంటూ పేచీ పెట్టారు. నాగం నివాసంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ పోటీ భేటీకి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, జైపాల్యాదవ్, ఉమామాధవరెడ్డి, గంపా గోవర్దన్, హరీశ్వర్రెడ్డిలతోపాటు మాజీ మంత్రి కె. విజయరామారావు, సంకినేని వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ విషయం మీడియాకు లీకవడంతో వాతావరణం వేడెక్కింది. రెండుగంటల పాటు ఇరుపక్షాలు వేర్వేరుగా చర్చలు జరిపాయి. ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తేనే తాము అంగీకరిస్తామని నాగం బృందం పట్టుబట్టింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయవద్దని బాబు వద్ద ఉన్న నేతలు అధినేతను కోరారు. తెలంగాణ ఉద్యమం కోసం ఆయన మధ్యేమార్గంగా సమన్వయకమిటీని ఏర్పాటు చేస్తానని చెప్పినట్లు మీడియాకు ముందుగా లీక్ చేశారు. అందుకు కూడా నాగం వర్గం ఒప్పుకోకపోవడంతో ఏమీ తేల్చకుండానే లంచ్ విరామం ఇచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు బాబు నివాసంలో జరిగే సమావేశానికి రావాల్సిందిగా అందుబాటులో ఉన్న పార్టీ నేతలందరికీ వర్తమానం అందింది. ఈ సమావేశానికి నాగం తదితరులు వస్తారని, అప్పుడు మాట్లాడుకుంటారని ప్రచారం జరిగింది.
మాకు వేరే ఉద్దేశం లేదు
చంద్రబాబు ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చిన నాగం తదితరులు తమ అలక వెనుక కారణాలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ‘మాకెలాంటి ఉద్దేశం లేదు, మీ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే పరిస్థితి సెన్సిటివ్గా ఉంది కాబట్టి కార్యాచరణ రూపొందించుకునేందుకు భేటీ అయ్యాం’ అని చంద్రబాబుతో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు స్పందించిన చంద్రబాబు మీ ఆలోచన ఎలా ఉన్నా తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి కదా అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని, అవసరమైతే వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వచ్చిన వార్తలపై చంద్రబాబును నాగం ప్రశ్నించారు. అయితే, అలాంటిదేమీ లేదని, ఆ వార్తలు తప్పని బాబు వారికి సమాధానమిచ్చినట్లు సమాచారం.
అసలు ఆహ్వానం ఉందా?
సాయంత్రం బాబు నివాసంలో జరిగిన భేటీకి నాగం తదితరులకు ఆహ్వానం ఉందా? అన్న దానిపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. నాగం జనార్దనరెడ్డి, కడియం శ్రీహరి, ఎరబ్రెల్లి దయాకర్రావు మినహా మిగిలిన వారికి ఆహ్వానమిచ్చారని, అందుకే వారు రాలేదని కొందరు పేర్కొన్నారు. ‘సాయంత్రం సమావేశానికి మాకు ఆహ్వానం లేదు. ఆహ్వానం వచ్చిన వాళ్లు వెళ్లారు. మాకు రాలేదు కాబట్టి మేం వెళ్లలేదు’ అంటూ నాగం మీడియాతో చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే, ఆ ముగ్గురికి కూడా ఆహ్వానం ఉన్నా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకే రాలేదని కూడా కొందరు వ్యాఖ్యానించారు.
నాలుగున్నర గంటల ఎపిసోడ్
ఉదయం నాగం నివాసంలో జరిగిన సమావేశానికి హాజరయిన నాయకులు కూడా బాబు నివాసానికి చేరుకోవడంతో నాగం కూడా వస్తారని భావించారు. అయితే, సాయంత్రం నాలుగు గంటలకు జరిగిన భేటీకి కూడా నాగం, కడియం, ఎరబ్రెల్లిలు హాజరుకాలేదు. దీంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని, అవసరమైతే వారిని వదులుకునేందుకు కూడా తాను సిద్ధమేనని, ఇష్టం లేని వాళ్లు కూడా వెళ్లిపోవచ్చని సమావేశంలో ఘాటైన వ్యాఖ్యానాలు చేశారని పార్టీ నేతలు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న నాగం కూడా ‘మమ్మల్ని వదులుకుంటామన్నారా? ఆయనకే అంత ఉంటే మాకెంత ఉండాలి. మాలాంటి వాళ్లను వదులుకుంటే తెలంగాణ ప్రాంతంలో పార్టీ జెండా దిమ్మెలు కూడా మిగలవు’ అని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమయంలో నాగం వర్గం పార్టీ సీనియర్ నేత కె. విజయరామారావు నివాసంలో సమావేశమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ అయిన నేతలు నాగం వర్గాన్ని కూడా పిలిపించాలని చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చారు. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు సమావేశంలో లేనప్పటికీ బాబుకు ఫోన్ చేసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
దీంతో చంద్రబాబు అంగీకరించి వారికి ఫోన్ చేసి మాట్లాడుకుందాం రమ్మని ఆహ్వానించారు. చంద్రబాబే ఫోన్ చేయడంతో నాగం, కడియం, ఎరబ్రెల్లి సాయంత్రం 7:40 గంటల సమయంలో సమావేశానికి హాజరయ్యారు. అయితే, ఆ సమయంలో చంద్రబాబు తన మూడురోజుల పర్యటనకు బయలుదేరేందుకు నివాసంలోని తన గదిలోకి వెళ్లిపోవడంతో కొంతసేపు నేతలంతా ఎదురుచూశారు. సమావేశ మందిరానికి వచ్చిన తరువాత ఓ ఐదు నిమిషాలు నాగంతో మాట్లాడిన చంద్రబాబు తాను వెళ్లాల్సిన రైలుకు సమయం కావడంతో 13వ తేదీన మరోసారి కూర్చుని మాట్లాడుకుందామంటూ వెళ్లిపోయారు.
శ్రీకృష్ణ నివేదికపై చర్చకు ఇంటికి రమ్మన్న బాబు
తెలంగాణ టీడీపీ శాఖ కోసం నాగం వర్గం పట్టు
బాబు నివాసానికి వచ్చేందుకు ససేమిరా...
ప్రత్యేక శాఖ ఇస్తేనే వస్తామని పేచీ
నో అన్న బాబు.. ఉద్యమాలు చేసుకోండి, శాఖ అక్కర్లేదని సూచన... వారిని వదులుకునేందుకు కూడా సిద్ధమని
మీడియాకు లీకులు
చంద్రబాబు, నాగంల సారథ్యంలో రెండు గ్రూపులుగా
సమావేశాలు... తెరపైకి సమన్వయ కమిటీ
తర్వాత బాబు ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వచ్చిన నాగం వర్గం... ఎటూ తేలని భేటీ; మళ్లీ 13న చర్చ
తెలుగుదేశం పార్టీలో తెలంగాణ వేడి మరింత రాజుకుంది. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో ఆ ప్రాంతానికి చెందిన నాయకులు ఆదివారం రోజంతా హైడ్రామా నడిపారు. ఉదయం నుంచి రాత్రి తొమ్మిదిగంటల వరకు సాగిన ఈ ఎపిసోడ్ ఆద్యంతం రక్తి కట్టించింది. రోజంతా జరిగిన హైడ్రామాలో నాగం వర్గాన్ని వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు సన్నిహితుల నుంచి సంకేతాలు వెళ్లడం తెలంగాణ నేతల్లో కలకలం రేపింది. నాగం వర్గం డిమాండ్ చేసినంత మాత్రాన తెలంగాణకు ప్రత్యేక శాఖ ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఇతర ప్రాంతాల నేతలు ప్రశ్నించడంతో చివరకు తెలంగాణ ఆందోళన కోసం ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో కథ తాత్కాలికంగా వాయిదా పడింది. విశ్వసనీయ సమాచారం మేరకు... జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తదనంతర పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు నిర్వహించాల్సిన పాత్ర, పార్టీ తరఫున కార్యాచరణ తయారుచేసేందుకు గాను తన నివాసానికి రావాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలోని ముఖ్యనేతలకు సమాచారం ఇచ్చారు.
ఈ సమావేశానికి ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేశ్రాథోడ్, సీనియర్ నాయకుడు దేవేందర్గౌడ్, ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తదితరులు హాజరయ్యారు. అయితే పార్టీ సీనియర్లు నాగం, కడియం, ఎరబ్రెల్లిలు తాము ఈ సమావేశానికి రావడం లేదని, తెలంగాణకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తేనే వస్తామంటూ పేచీ పెట్టారు. నాగం నివాసంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ పోటీ భేటీకి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, జైపాల్యాదవ్, ఉమామాధవరెడ్డి, గంపా గోవర్దన్, హరీశ్వర్రెడ్డిలతోపాటు మాజీ మంత్రి కె. విజయరామారావు, సంకినేని వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ విషయం మీడియాకు లీకవడంతో వాతావరణం వేడెక్కింది. రెండుగంటల పాటు ఇరుపక్షాలు వేర్వేరుగా చర్చలు జరిపాయి. ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తేనే తాము అంగీకరిస్తామని నాగం బృందం పట్టుబట్టింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయవద్దని బాబు వద్ద ఉన్న నేతలు అధినేతను కోరారు. తెలంగాణ ఉద్యమం కోసం ఆయన మధ్యేమార్గంగా సమన్వయకమిటీని ఏర్పాటు చేస్తానని చెప్పినట్లు మీడియాకు ముందుగా లీక్ చేశారు. అందుకు కూడా నాగం వర్గం ఒప్పుకోకపోవడంతో ఏమీ తేల్చకుండానే లంచ్ విరామం ఇచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు బాబు నివాసంలో జరిగే సమావేశానికి రావాల్సిందిగా అందుబాటులో ఉన్న పార్టీ నేతలందరికీ వర్తమానం అందింది. ఈ సమావేశానికి నాగం తదితరులు వస్తారని, అప్పుడు మాట్లాడుకుంటారని ప్రచారం జరిగింది.
మాకు వేరే ఉద్దేశం లేదు
చంద్రబాబు ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చిన నాగం తదితరులు తమ అలక వెనుక కారణాలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ‘మాకెలాంటి ఉద్దేశం లేదు, మీ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే పరిస్థితి సెన్సిటివ్గా ఉంది కాబట్టి కార్యాచరణ రూపొందించుకునేందుకు భేటీ అయ్యాం’ అని చంద్రబాబుతో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు స్పందించిన చంద్రబాబు మీ ఆలోచన ఎలా ఉన్నా తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి కదా అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని, అవసరమైతే వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వచ్చిన వార్తలపై చంద్రబాబును నాగం ప్రశ్నించారు. అయితే, అలాంటిదేమీ లేదని, ఆ వార్తలు తప్పని బాబు వారికి సమాధానమిచ్చినట్లు సమాచారం.
అసలు ఆహ్వానం ఉందా?
సాయంత్రం బాబు నివాసంలో జరిగిన భేటీకి నాగం తదితరులకు ఆహ్వానం ఉందా? అన్న దానిపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. నాగం జనార్దనరెడ్డి, కడియం శ్రీహరి, ఎరబ్రెల్లి దయాకర్రావు మినహా మిగిలిన వారికి ఆహ్వానమిచ్చారని, అందుకే వారు రాలేదని కొందరు పేర్కొన్నారు. ‘సాయంత్రం సమావేశానికి మాకు ఆహ్వానం లేదు. ఆహ్వానం వచ్చిన వాళ్లు వెళ్లారు. మాకు రాలేదు కాబట్టి మేం వెళ్లలేదు’ అంటూ నాగం మీడియాతో చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే, ఆ ముగ్గురికి కూడా ఆహ్వానం ఉన్నా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకే రాలేదని కూడా కొందరు వ్యాఖ్యానించారు.
నాలుగున్నర గంటల ఎపిసోడ్
ఉదయం నాగం నివాసంలో జరిగిన సమావేశానికి హాజరయిన నాయకులు కూడా బాబు నివాసానికి చేరుకోవడంతో నాగం కూడా వస్తారని భావించారు. అయితే, సాయంత్రం నాలుగు గంటలకు జరిగిన భేటీకి కూడా నాగం, కడియం, ఎరబ్రెల్లిలు హాజరుకాలేదు. దీంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని, అవసరమైతే వారిని వదులుకునేందుకు కూడా తాను సిద్ధమేనని, ఇష్టం లేని వాళ్లు కూడా వెళ్లిపోవచ్చని సమావేశంలో ఘాటైన వ్యాఖ్యానాలు చేశారని పార్టీ నేతలు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న నాగం కూడా ‘మమ్మల్ని వదులుకుంటామన్నారా? ఆయనకే అంత ఉంటే మాకెంత ఉండాలి. మాలాంటి వాళ్లను వదులుకుంటే తెలంగాణ ప్రాంతంలో పార్టీ జెండా దిమ్మెలు కూడా మిగలవు’ అని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమయంలో నాగం వర్గం పార్టీ సీనియర్ నేత కె. విజయరామారావు నివాసంలో సమావేశమైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో భేటీ అయిన నేతలు నాగం వర్గాన్ని కూడా పిలిపించాలని చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చారు. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు సమావేశంలో లేనప్పటికీ బాబుకు ఫోన్ చేసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
దీంతో చంద్రబాబు అంగీకరించి వారికి ఫోన్ చేసి మాట్లాడుకుందాం రమ్మని ఆహ్వానించారు. చంద్రబాబే ఫోన్ చేయడంతో నాగం, కడియం, ఎరబ్రెల్లి సాయంత్రం 7:40 గంటల సమయంలో సమావేశానికి హాజరయ్యారు. అయితే, ఆ సమయంలో చంద్రబాబు తన మూడురోజుల పర్యటనకు బయలుదేరేందుకు నివాసంలోని తన గదిలోకి వెళ్లిపోవడంతో కొంతసేపు నేతలంతా ఎదురుచూశారు. సమావేశ మందిరానికి వచ్చిన తరువాత ఓ ఐదు నిమిషాలు నాగంతో మాట్లాడిన చంద్రబాబు తాను వెళ్లాల్సిన రైలుకు సమయం కావడంతో 13వ తేదీన మరోసారి కూర్చుని మాట్లాడుకుందామంటూ వెళ్లిపోయారు.
తెలుగుదేశంలో తెలంగాణ కుంపటి
తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులలో నెలకొన్న గందరగోళానికి తెరదింపేందుకు తెలంగాణ సమన్వయ సంఘాన్ని (టీడీపీటీసీసీ) ఏర్పాటుచేయనున్నారు. పార్టీని కాపాడు కోవడం, అదే సమయంలో తెలంగాణలో ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమాలు నిర్వహిం చడం, ప్రత్యర్థి పార్టీల దుష్ర్పచారాన్ని అడ్డుకుని తిరిగి ప్రజలకు చేరువయ్యేందుకు సమన్వయ సంఘం ఏర్పాటుచేయాలన్న సీనియర్ల డిమాం డును బాబు అంగీకరించారు. ఇకపై తెలం గాణకు సంబంధించి చేయనున్న ఆందోళనలు, ఉద్యమాలు, నిర్ణయాలు ఈ బ్యానర్ పక్షానే నిర్వహించనున్నారు. ఈనెల 13న పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నగరానికి వచ్చిన తర్వాత నేతలతో చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు.
బహుశా సంక్రాంతి రోజున కమిటీ విధివిధానాలు, సభ్యుల పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. తెలంగాణకు ప్రత్యేక శాఖ కావాలని నలుగురయిదుగురు సీనియర్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ, మెజారిటీ నేతలు మాత్రం కాంగ్రెస్లో ఇప్పటికే ఉన్న టీఆర్సీసీ మాదిరిగానే తమకూ ఒక సమన్వయ కమిటీని ఏర్పాటుచేయాలని గత కొద్దిరోజుల నుంచి బాబుకు సూచిస్తూ వస్తున్నారు. దీని ద్వారా తాము తెలంగాణపై కలసి కట్టుగా పని చేయవచ్చని, దానితోపాటు కొందరు నాయకులు సొంత అజెండాతో పనిచేస్తున్నారన్న అపవాదును కూడా ఈ కమిటీ ఏర్పాటుతో పోగొట్టి, అంతా సమిష్ఠిగా ఉన్నామన్నసంకేతాలు పంపించవచ్చని బాబుకు వివరిస్తూ వస్తు న్నారు. ఇదే సమయంలో తెలంగాణ సమన్వయ కమిటీ ఏర్పాటు ద్వారా తెలంగాణ ప్రజల్లో ప్రత్యర్ధులు నాటిన దురభిప్రాయాన్ని కూడా తొలగించవచ్చని సూచించారు. దానికి స్పందించిన బాబు మీరంతా కలసికట్టుగా ఒక మాట మీద ఉంటే అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దానితో టీడీపీటీసీసీ ఏర్పాటుకు రంగం సిద్ధమయింది. అయితే, ఇప్పటికే ఉన్న టీడీపీ తెలంగాణ ఫోరంను యథాతథంగానే కొనసాగించనున్నారు.
దానిని మరింత బలపరిచి, సమిష్ఠి నిర్ణయాలు తీసుకునేందుకు దానికీ ఒక కమిటీని వేయాలని పలువురు ఎమ్మెల్యేలు బాబుకు సూచించారు. అంటే నాగం జనార్దన్రెడ్డిని కన్వీనర్గా కొనసాగిస్తూనే మిగిలిన వారిని కో కన్వీనర్లను నియమించాలని యోచిస్తున్నారు. ఉత్తర, దక్షిణ తెలంగాణతో పాటు, గ్రేటర్ హైదరాబాద్- రంగారెడ్డి నుంచి కూడా ఒకరిని కో కన్వీనర్లుగా నియమించే అవకా శం ఉంది. ముగ్గురు కో కన్వీనర్లను నియమించే అవకాశా లున్నాయంటున్నారు. దీని ద్వారా సమిష్ఠి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, అప్పుడు సమిష్ఠి బాధ్యత కూడా పెరిగి, ప్రత్యర్థి పార్టీలపై సమర్థవంతంగా దాడులు చేయవచ్చని పలువురు తెలంగాణ సీనియర్లు బాబుకు సూచించారు. ఇక టీడీపీటీసీసీకి బీసీ లేదా ఎస్సీ నేతకు కన్వీనర్ బాధ్యతలు అప్పచెప్పవచ్చని తెలుస్తోంది.
బీసీ అయితే దేవేందర్గౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్, ఎల్.రమణలో ఒకరిని; ఎస్సీలయితే మోత్కుపల్లి నర్శింహులును నియమించవచ్చని చెబుతున్నారు. అయితే దీనికి కన్వీనరు ఉండాలా ? లేక అంతా సభ్యులే ఉండాలా అన్నది ఇంకా నిర్ణయం కాలేదంటున్నారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణపై తన వైఖరేమిటో చెప్పకపోయినా ఆ పార్టీ నాయకులు ఎక్కడా సోనియాగాంధీ ప్రస్తావన తీసుకురావడం లేదని, ఆమెపై ఒత్తిడి చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. కానీ తమ పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం బాబుపై ఒత్తిడి చేయడం వల్ల ప్రజల్లో పార్టీ అప్రతిష్ఠ పాలవుతోందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇకపై తాము కూడా టీడీపీటీసీసీని ఏర్పాటుచేసుకుని కాంగ్రెస్ వైఖరినే అనుసరిస్తామని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ కాంగ్రెస్-టీఆర్ఎస్ ట్రాప్లో చిక్కుకో కూడదని, ఇప్పటివరకూ సమిష్ఠి నిర్ణయాలు లేకపోవడం వల్లే తాము ప్రత్యర్థులకు దొరికిపోతున్నామని విశ్లేషించా రు. టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం, టీడీపీటీసీసీలకు కమిటీలు ఏర్పాటుచేసుకోవడం వల్ల సమిష్ఠి నాయకత్వా నికి చోటు కల్పించటంతో పాటు, ఇకపై ఎవరికీ సొంత అజెండాను అమలుచేసే అవకాశాలు ఉండవని తెలంగాణ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఈ కమిటీని ఎవరైనా అంగీకరించవలసిందేనని, లేకపోతే వారికి కచ్చితంగా సొంత అజెండాలు ఉన్నట్లుగానే మిగి లిన వారు భావించవలసి ఉంటుందని చెబుతున్నారు. ప్రత్యేక శాఖ వల్ల పార్టీ నిలువునా చీలిపోయిందన్న భావన ఏర్పడుతుందని, జాతీయ పార్టీలయిన కాంగ్రెస్-బీజేపీకి సైతం ప్రత్యేక శాఖ లేనప్పుడు, ప్రాంతీయ పార్టీ అయిన మనకు ప్రత్యేక శాఖ ఉండాలన్న వాదన సమంజసంగా ఉండదని కొట్టిపారేస్తున్నారు. టీఆర్ఎస్టీసీసీ-ఫోరం సంయుక్తంగానే ఉద్యమాలు చేపట్టే వెసులుబాటు ఉన్నం దున, ఆ మేరకు పోరాట కార్యక్రమాలు రూపొందించు కుంటామని సీనియర్ నేతలు చెబుతున్నారు.
బహుశా సంక్రాంతి రోజున కమిటీ విధివిధానాలు, సభ్యుల పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. తెలంగాణకు ప్రత్యేక శాఖ కావాలని నలుగురయిదుగురు సీనియర్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ, మెజారిటీ నేతలు మాత్రం కాంగ్రెస్లో ఇప్పటికే ఉన్న టీఆర్సీసీ మాదిరిగానే తమకూ ఒక సమన్వయ కమిటీని ఏర్పాటుచేయాలని గత కొద్దిరోజుల నుంచి బాబుకు సూచిస్తూ వస్తున్నారు. దీని ద్వారా తాము తెలంగాణపై కలసి కట్టుగా పని చేయవచ్చని, దానితోపాటు కొందరు నాయకులు సొంత అజెండాతో పనిచేస్తున్నారన్న అపవాదును కూడా ఈ కమిటీ ఏర్పాటుతో పోగొట్టి, అంతా సమిష్ఠిగా ఉన్నామన్నసంకేతాలు పంపించవచ్చని బాబుకు వివరిస్తూ వస్తు న్నారు. ఇదే సమయంలో తెలంగాణ సమన్వయ కమిటీ ఏర్పాటు ద్వారా తెలంగాణ ప్రజల్లో ప్రత్యర్ధులు నాటిన దురభిప్రాయాన్ని కూడా తొలగించవచ్చని సూచించారు. దానికి స్పందించిన బాబు మీరంతా కలసికట్టుగా ఒక మాట మీద ఉంటే అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దానితో టీడీపీటీసీసీ ఏర్పాటుకు రంగం సిద్ధమయింది. అయితే, ఇప్పటికే ఉన్న టీడీపీ తెలంగాణ ఫోరంను యథాతథంగానే కొనసాగించనున్నారు.
దానిని మరింత బలపరిచి, సమిష్ఠి నిర్ణయాలు తీసుకునేందుకు దానికీ ఒక కమిటీని వేయాలని పలువురు ఎమ్మెల్యేలు బాబుకు సూచించారు. అంటే నాగం జనార్దన్రెడ్డిని కన్వీనర్గా కొనసాగిస్తూనే మిగిలిన వారిని కో కన్వీనర్లను నియమించాలని యోచిస్తున్నారు. ఉత్తర, దక్షిణ తెలంగాణతో పాటు, గ్రేటర్ హైదరాబాద్- రంగారెడ్డి నుంచి కూడా ఒకరిని కో కన్వీనర్లుగా నియమించే అవకా శం ఉంది. ముగ్గురు కో కన్వీనర్లను నియమించే అవకాశా లున్నాయంటున్నారు. దీని ద్వారా సమిష్ఠి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, అప్పుడు సమిష్ఠి బాధ్యత కూడా పెరిగి, ప్రత్యర్థి పార్టీలపై సమర్థవంతంగా దాడులు చేయవచ్చని పలువురు తెలంగాణ సీనియర్లు బాబుకు సూచించారు. ఇక టీడీపీటీసీసీకి బీసీ లేదా ఎస్సీ నేతకు కన్వీనర్ బాధ్యతలు అప్పచెప్పవచ్చని తెలుస్తోంది.
బీసీ అయితే దేవేందర్గౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్, ఎల్.రమణలో ఒకరిని; ఎస్సీలయితే మోత్కుపల్లి నర్శింహులును నియమించవచ్చని చెబుతున్నారు. అయితే దీనికి కన్వీనరు ఉండాలా ? లేక అంతా సభ్యులే ఉండాలా అన్నది ఇంకా నిర్ణయం కాలేదంటున్నారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణపై తన వైఖరేమిటో చెప్పకపోయినా ఆ పార్టీ నాయకులు ఎక్కడా సోనియాగాంధీ ప్రస్తావన తీసుకురావడం లేదని, ఆమెపై ఒత్తిడి చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. కానీ తమ పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం బాబుపై ఒత్తిడి చేయడం వల్ల ప్రజల్లో పార్టీ అప్రతిష్ఠ పాలవుతోందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇకపై తాము కూడా టీడీపీటీసీసీని ఏర్పాటుచేసుకుని కాంగ్రెస్ వైఖరినే అనుసరిస్తామని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ కాంగ్రెస్-టీఆర్ఎస్ ట్రాప్లో చిక్కుకో కూడదని, ఇప్పటివరకూ సమిష్ఠి నిర్ణయాలు లేకపోవడం వల్లే తాము ప్రత్యర్థులకు దొరికిపోతున్నామని విశ్లేషించా రు. టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం, టీడీపీటీసీసీలకు కమిటీలు ఏర్పాటుచేసుకోవడం వల్ల సమిష్ఠి నాయకత్వా నికి చోటు కల్పించటంతో పాటు, ఇకపై ఎవరికీ సొంత అజెండాను అమలుచేసే అవకాశాలు ఉండవని తెలంగాణ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఈ కమిటీని ఎవరైనా అంగీకరించవలసిందేనని, లేకపోతే వారికి కచ్చితంగా సొంత అజెండాలు ఉన్నట్లుగానే మిగి లిన వారు భావించవలసి ఉంటుందని చెబుతున్నారు. ప్రత్యేక శాఖ వల్ల పార్టీ నిలువునా చీలిపోయిందన్న భావన ఏర్పడుతుందని, జాతీయ పార్టీలయిన కాంగ్రెస్-బీజేపీకి సైతం ప్రత్యేక శాఖ లేనప్పుడు, ప్రాంతీయ పార్టీ అయిన మనకు ప్రత్యేక శాఖ ఉండాలన్న వాదన సమంజసంగా ఉండదని కొట్టిపారేస్తున్నారు. టీఆర్ఎస్టీసీసీ-ఫోరం సంయుక్తంగానే ఉద్యమాలు చేపట్టే వెసులుబాటు ఉన్నం దున, ఆ మేరకు పోరాట కార్యక్రమాలు రూపొందించు కుంటామని సీనియర్ నేతలు చెబుతున్నారు.


No comments:
Post a Comment